కథ చెప్తుంటే నిద్రపోయిన స్టార్ హీరో..త్రివిక్రమ్ ఏం చేసాడో తెలుసా..?

సినీ ఇండస్ట్రీలో ఓ హీరోని ఊహించుకుని కధను రాసుకుంటారు. కానీ ఆ సినిమా కధ సదరు హీరోకి నచ్చకపోయినా ..నచ్చినా డేట్లు అడ్జేస్ట్ చేయలేకపోయినా..ఆ స్టోరీ మరోక హీరో చేతికి వెళ్తుంది. అలా చెయ్యి దాకా వచ్చి చేతులారా వదిలేసుకున్న హీరోలు బోలెడు మంది ఉన్నారు. అప్పటి హీరో నందమూరి తారక రామారావు దగ్గర నుండి..నిన్న కాక మొన్న వచ్చిన సిద్ధు జొన్నాలగడ్డ వరకు అందరూ ఇంతే. అయితే, ఓ స్టార్ హీరో మాత్రం మాటల మాంత్రికుడు కధను చెప్పుతుంటే..నిద్రపోయారట. ఈ విషయాని ఆయనే స్వయంగా చెప్పడం గమనార్హం. త్రివిక్రమ్ లాంటి హిట్ పర్సన్ కధను చెప్పుతుంటే నిద్రపోయిన ఆ హీరో ఎవరు..? ఆ తరువాత ఏం జరిగిందో..ఇక్కడ ఇప్పుడు చదివి తెలుసుకుందాం రండి..!!

ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ కి త్రివిక్రమ్ కి మధ్య ఉన్న ఫ్రెండ్ షిప్ గురించి మనకు తెలిసిందే. జాన్ జిగిడి దోస్త్ లు . పవన్ కి మంచి మంచి హిట్స్ ఇచ్చారు త్రివిక్రమ్. అలాంటి ఆయన ఒకరోజు అద్దిరిపోయే కధను రాసుకుని..పవన్ వద్దకు పరిగెత్తుకుంటు వెళ్లి ..”మీకు ఈ కధ నచ్చుతుంది..బాగుంటుంది..వినండి అంటే..పవన్ సరే చెప్పమాన్నాడట”. ఇక త్రివిక్రమ్ ఎంతో ఇష్టంగా రాసుకున్న కధను ప్రతి లైన్ వివరంగా వివరిస్తూ స్టోరీ చెప్పడంలో లీనమైపోయాడు..పవన్ నుండి ఎటువంటి రియాక్షన్ రాకపోవడంతో స్టోరీ మధ్యలో ఆపేసి ఆయన వైపు చూస్తే.. పవన్ నిద్రపోతూ కనిపించాడట. దీంతో అప్పడే త్రివిక్రమ్ అర్ధమైపోయిందట. పవన్ కి ఈ స్టోరీ నచ్చలేదు అని.

ఇక ఆ తరువాత ఆ కధను మహేష్ బాబుకు వినిపించగా..ఆయనకు నచ్చి..వెంటనే తెరకెక్కించేశారు. సీన్ కట్ చేస్తే.. ఆ సినిమా నే మహేష్ బాబు కి కెరీర్ లో వన్ ఆఫ్ ది బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన “అతడు” సినిమా. ఆ రోజు పవన్ వద్దు అనుకున్న సినిమా నే మహేష్ చేసి అధ్భుతమైన విజయాని తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రజెంట్ మళ్ళీ త్రివిక్రమ్ డైరెక్షన్ లో మహేష్ బాబు మరో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని అభిమానులు ఫిక్స్ అయిపోయారు. ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఏమిటంటే ఈ సినిమా అతడు కి సీక్వెల్ గా తెరకెక్కుతుందంటూ టాక్ వినిపిస్తుంది. మరి చూడాలి ఈ సినిమా ఎలాంటి పేరు తీసుకువస్తుందో మహేష్ కి..?