కొత్త రేటుతో నిర్మాత‌ల‌కు చుక్క‌లు చూపిస్తోన్న టాలీవుడ్ హీరో !

తెలుగు సినిమా రంగంలో ద‌శాబ్ద కాలం ముందు నుంచే హీరోగా కొన‌సాగుతున్నాడు యంగ్ హీరో శ‌ర్వానంద్‌. గ‌మ్యం సినిమాతో ఒక్క‌సారిగా లైమ్‌లైట్‌లోకి వ‌చ్చిన శ‌ర్వానంద్‌కు వ‌రుస‌గా కొన్ని హిట్లు ప‌డ్డాయి. శ‌త‌మానం భ‌వ‌తి సినిమా రిలీజ్ టైంలో ఇద్ద‌రు స్టార్ హీరోల క్రేజీ ప్రాజెక్టుల‌ను ఢీ కొట్టి హిట్ కొట్ట‌డంతో మ‌నోడికి మంచి మార్కెట్ కూడా వ‌చ్చింది. అయితే గ‌త కొంత కాలంగా స‌రైన క‌థ‌లు ఎంచుకోక‌పోవ‌డంతో వ‌రుస ప్లాపుల‌తో కొట్టుమిట్టాడుతున్నాడు. శర్వానంద్ చివ‌రిసారిగా న‌టించిన నాలుగు సినిమా ప్లాప్ అయ్యాయి.

ఒక‌ప్పుడు శ‌ర్వా సినిమా వ‌స్తుందంటే చాలు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర మంచి అచంనాలు ఉండేవి. బ‌య్య‌ర్లు అయితే ఆ సినిమా రైట్స్ కోసం ఎగ‌బ‌డే వారు. శ‌త‌మానం భ‌వ‌తి, ర‌న్ రాజా ర‌న్‌, మ‌హానుభావుడు హిట్ అయ్యాక శ‌ర్వా డేట్లు కూడా మీడియం రేంజ్ నిర్మాత‌లు, ద‌ర్శ‌కుల‌కు దొర‌క‌లేదు. క‌ట్ చేస్తే ఇప్పుడు సీన్ రివ‌ర్స్ అయ్యింది. శ‌ర్వా క‌థాబ‌లం ఉన్న సినిమాలు కాకుండా రెమ్యున‌రేష‌న్ కోసం ఆశ‌ప‌డి సినిమాలు చేస్తున్న‌ట్టుగా ఉంది.

వ‌రుస ప్లాపుల‌తో మార్కెట్ ప‌డిపోయినా కూడా శ‌ర్వా మాత్రం రు. 10 కోట్లు ఎవ‌రు ఇస్తే వాళ్ల‌కే డేట్లు ఇచ్చేస్తున్నాడ‌న్న గుస‌గుస‌లు ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో వినిపిస్తున్నాయి. దీంతో స‌రైన క‌థ‌లు లేక ఇష్ట‌మొచ్చిన‌ట్టు సినిమాలు చేస్తుండ‌డంతో కెరీర్ పాతాళంలోకి వెళ్లిపోయి.. మార్కెట్ పూర్తిగా డౌన్ అయిపోయింది. అస‌లు ఇప్పుడు శ‌ర్వా సినిమా వ‌స్తోంది అంటేనే ఎవ్వ‌రూ ప‌ట్టించుకోని ప‌రిస్థితి వ‌చ్చేసింది. మ‌రి శ‌ర్వా ఇప్ప‌ట‌కీ అయినా రెమ్యున‌రేష‌న్‌కు ప్ర‌యార్టీ ఇవ్వ‌కుండా క‌థ‌ల‌కు ప్ర‌యార్టీ ఇస్తాడేమో ? చూడాలి.