ఈ హీరో చేసిన పనికి ఇండస్ట్రీ మొత్తం షాక్…!

సాధారణంగా ఏదైనా మంచి పని చేస్తున్నప్పుడు పిల్లి ఎదురు వచ్చింది అంటే చాలు అశుభం అని భావిస్తూ ఉంటారు ప్రతి ఒక్కరు. ఒకవేళ ఇలా పిల్లి ఎక్కడైనా ఎదురొచ్చి నట్లు కనిపిస్తే కాసేపు ఆగి వెళ్తూ ఉంటారు. ఇది అందరికీ తెలిసిన విషయమే.. అయితే ఇలా పిల్లి ఎదురు రావడం వల్ల ఎలాంటి అశుభాలు కలగవని ఇలాంటివి కేవలం మూఢనమ్మకాలు మాత్రమే అని అందరికీ తెలిసిన.. ఎందుకో జాగ్రత్తలు పాటిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఒక హీరో మాత్రం అందరికంటే భిన్నంగా కాస్త విచిత్రంగా ప్రవర్తించి అప్పట్లో వార్తల్లోకెక్కారు. ఇక ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

తమిళ నటుడు మన్సూర్ అలీ ఖాన్ ఫైర్ బ్రాండ్గా తమిళ ఇండస్ట్రీలో ఊహించని రేంజిలో క్రేజ్ సంపాదించుకున్నాడు. కెప్టెన్ ప్రభాకర్ అనే సినిమా 1991 లో తెరకెక్కింది. ఈ సినిమాలో వీరభద్రం అనే విలన్ క్యారెక్టర్ లో నటించిన మన్సూర్ అలీ ఖాన్ మంచి గుర్తింపు సంపాదించాడు. ముఖ్యంగా ఈ సినిమాతో తెలుగువారికి కూడా సుపరిచితుడు గా మారిపోయాడు ఆయన. ఇక ఆ తర్వాత కూడా ఎన్నో సినిమాలతో తెలుగు ప్రేక్షకులను పలకరిస్తూనే ఉన్నారు మన్సూర్ అలీ ఖాన్.

మనసులో ఏది పెట్టుకోకుండా ముక్కుసూటిగా మాట్లాడుతూ ఎన్నో సార్లు వివాదాల్లో చిక్కుకొని వార్తల్లో హాట్ టాపిక్ గా మారిపోయారు. ఇటీవలే కరోనా వ్యాక్సిన్ గురించి కూడా తప్పుగా మాట్లాడి జైలుకెళ్లి మళ్లీ బయటికి వచ్చారు. ఆయన కెరీర్ ను మొదట విలన్ రోల్స్ తో ప్రారంభించారు. ఇక ఆ తర్వాత అందరూ హీరో అవుతున్నారు నేను ఎందుకు అవ కూడదు అనుకున్నాడు ఆయన.. సొంతంగా ఒక సినిమాను తెరకెక్కించాడు. రాజాధిరాజా రాజ మార్తాండ కృష్ణ కామరసన్ అనే టైటిల్ కూడా పెట్టాడు. ఈ సినిమా మంచి విజయం సాధించింది. దీంతో రావణన్ అనే టైటిల్ పెట్టి మరో సినిమాని కూడా తీశాడు.

అయితే మన్సూర్ అలీ ఖాన్ ఎక్కువగా మూఢనమ్మకాలను నిరసిస్తూ ఉంటాడు. కానీ ఆ తర్వాత మాత్రం ఆయన చేసిన పనులు ఇండస్ట్రీనే ముక్కున వేలేసుకునేలా చేశాయి. రాహుకాలంలో ముహూర్తం నిర్ణయించడమే కాదు దీపారాధన ను కూడా ఒక వితంతువు చేత చేయించారు.. ఫస్ట్ షాట్ చిత్రీకరించడానికి ముందు ఒక పెళ్లి కెమెరా ముందు పరిగెత్తించాడు. ఆయన ఇలా రావణన్ సినిమాకు ముందు ఇవన్నీ చేసి ఇండస్ట్రీని ఆశ్చర్యపరిచాడు.ఇక ఈ సినిమా మంచి విజయం సాధించడం గమనార్హం.