ఈ యేడాది అంతా పాన్ ఇండియా సినిమా లవర్స్కు మంచి విజువల్ ఫీస్ట్లు రెడీ అవుతున్నాయి. వరుస పెట్టి పాన్ ఇండియా సినిమాలు థియేటర్లలో దండయాత్రలు చేసేందుకు క్యూలో ఉన్నాయి. ఈ పరంపరలో ఈ రోజు రిలీజ్ అయిన ప్రభాస్ రాధేశ్యామ్.. ఆ వెంటనే ఈ నెల 25న ఎన్టీఆర్, రామ్చరణ్ త్రిబుల్ ఆర్, ఆ తర్వాత మెగాస్టార్ ఆచార్య.. ఇలా వరుస పెట్టి పెద్ద సినిమాలు లైన్లో ఉన్నాయి.
ఇక ఈ నెల 25న ఆల్ టైం మోస్ట్ అవైటెడ్ సినిమా వస్తోంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ లతో దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన భారీ పాన్ ఇండియా మల్టీ స్టారర్ “రౌద్రం రణం రుధిరం” భారీ అంచనాలతో వస్తోంది. ఇండియన్ సినీ లవర్స్ అందరూ అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ సినిమా యూఎస్ బాక్సాఫీస్ దగ్గర మాత్రం అదరగొడుతుంది.
20 రోజుల ముందు అడ్వాన్స్ బుకింగ్లు స్టార్ట్ చేస్తేనే అదిరిపోయే రేంజ్లో వసూళ్లు వస్తున్నాయి. కొందరు ఎన్టీఆర్ అభిమానులు బల్క్లో టిక్కెట్లు బుక్ చేస్తున్నారు. మరి కొందరు అయితే షోలకు షోలు బుక్ చేస్తున్నారు. తాజాగా త్రిబుల్ ఆర్ అదిరిపోయే రికార్డు తన ఖాతాలో వేసుకుంది. ఈ సినిమా రిలీజ్ కి ఇంకా 15 రోజులు మిగిలి ఉండగానే టోటల్ గా 1 మిలియన్ డాలర్స్ మార్క్ క్రాస్ చేసింది.
ఈ అరుదైన ఘనత సాధించిన సినిమాగా త్రిబుల్ ఆర్ రికార్డులకు ఎక్కింది. ఇంకా రిలీజ్కు 15 రోజుల టైం ఉండడంతో ఈ సినిమా ఇంకెన్ని సంచలనాలు సాధిస్తుందో అని ప్రతి ఒక్కరు ఎగ్జైట్మెంట్తో వెయిట్ చేస్తున్నారు.