మెగాస్టార్ చిరంజీవి వచ్చేనెల 29న ఆచార్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. సైరా తర్వాత చాలా లాంగ్ గ్యాప్ తీసుకుని చిరంజీవి నటించిన సినిమా ఇదే. అటు భరత్ అనే నేను సినిమా తర్వాత నాలుగున్నరేళ్ల లాంగ్ గ్యాప్తో కొరటాల శివ ఆచార్య సినిమాతోనే ప్రేక్షకులను పలకరించనున్నాడు. కొరటాల – చిరు కాంబినేషన్ మాత్రమే కాదు.. అటు ఈ సినిమాలో మెగాపవర్ స్టార్ రామ్చరణ్ సైతం అదిరిపోయే క్యారెక్టర్ చేశారు. చిరుకు జోడీగా కాజల్ అగర్వాల్, చెర్రీకి జోడీగా పూజా హెగ్డే హీరోయిన్లుగా నటించారు.
ఇక చిరు యంగ్ డైరెక్టర్ కె.ఎస్. రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో ఓ పవర్ ఫుల్ మాస్ ఎంటర్టైనర్ చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు వాల్తేర్ వీరయ్య అన్న టైటిల్ ఖరారు చేసినట్టు వార్తలు వస్తున్నాయి. మెగాస్టార్ 154 గా ఈ సినిమా వస్తోంది. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవితో పాటు రవితేజ కూడా ఓ ముఖ్యమైన పాత్రను పోషిస్తున్న సంగతి తెలిసిందే.
గతంలో వీరిద్దరు కలిసి అన్నయ్య సినిమాలో నటించారు. ఇప్పుడు ఈ సినిమాలో నటించేందుకు రవితేజ ఏకంగా రు. 10 కోట్లు డిమాండ్ చేశాడట. రవితేజ ఇటీవల సోలో సినిమాకే రు. 10 – 12 కోట్లు తీసుకుంటున్నాడు. ఇది చిరంజీవి సినిమా.. పైగా సైడ్ రోల్ అయినా కూడా రెమ్యునరేషన్ విషయంలో ఏ మాత్రం వెనక్కు తగ్గడం లేదు. ఈ సినిమాలో చిరుకు జోడీగా శృతి హాసన్, మాళవిక మోహన్ నటిస్తున్నారట.