రాధేశ్యామ్ సినిమా చూసిన రాజమౌళి.. అలా చెప్పడంతో ప్రభాస్ లో టెన్షన్..?

ప్రభాస్ అభిమానులందరూ కళ్ళల్లో వత్తులు వేసుకుని కాయలు కాసేలా ఎదురు చూసిన సినిమా రాధేశ్యామ్.. ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా వైరస్ కారణంగా వాయిదా పడుతూ వస్తోంది. సంక్రాంతికి విడుదల అవుతుంది అనుకుంటే అప్పుడు వాయిదా పడింది. ఎట్టకేలకు మార్చి 11వ తేదీన విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు. భారీ అంచనాల మధ్య రాబోతున్న రాధేశ్యామ్ విడుదలకు మూడు రోజులు టైం మాత్రమే మిగిలి ఉంది. ఇక మూడు రోజులు తీసేస్తే నాలుగవ రోజు ఈ సినిమా రిజల్ట్ ఏంటి అన్నది మాత్రం బయటికి రాబోతుంది. ఇక ఈ సినిమా కోసం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ దాదాపు మూడేళ్ల గ్యాప్ తీసుకున్నాడు అన్న విషయం తెలిసిందే.

సినిమా విడుదలకు ఇంకా మూడు రోజులు మాత్రమే సమయం ఉండటంతో ఇక ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ శరవేగంగా జరుగుతున్నాయి. ఇక ప్రస్తుతం టాలీవుడ్ లో బాలీవుడ్ లో ఎక్కడ చూసినా ప్రభాస్ రాధేశ్యామ్ సినిమాకు సంబంధించిన ముచ్చట్లే వినిపిస్తున్నాయి. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ అయితే బాగానే ఉంది. సినిమా రన్ టైం 2:18 గంటలు ఉంది. ఇక ఈ సినిమాలో మొదటిసారి ప్రభాస్ సరసన పూజా హెగ్డే నటిస్తున్న విషయం తెలిసిందే. సినిమా బడ్జెట్ ఎంత అన్న దానిపై మాత్రం అటు చిత్ర బృందం ఎలాంటి క్లారిటీ ఇవ్వకపోవడం గమనార్హం. అయితే మొదటి రెండు వందల కోట్లు అనుకున్నప్పటికీ ఆ తర్వాత మాత్రం కరోనా ఇబ్బందుల వల్ల 300 కోట్ల వరకు బడ్జెట్ అయినట్లు టాక్ వినిపిస్తోంది.

అయితే రాధేశ్యామ్ చిత్రబృందం ముందుగా ఈ సినిమాని దర్శకుడు జక్కన్న కు చూపినట్లు తెలుస్తోంది. రాజమౌళితో పాటు దిల్రాజు సహా మరికొంత మంది ప్రముఖులు కూడా ఈ సినిమాను చూశారట. ఈ సినిమా అవుట్ పుట్ తో పాటు దర్శకుడు రాజమౌళి పూర్తిగా సంతృప్తి చెందాడట. కానీ అక్కడక్కడా చిన్న కరెక్షన్లు చెప్పడంతో ప్రస్తుతం వాటిని ఎడిట్ చేసి కట్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. 02:18 గంటలుగా ఉన్న రన్ టైం ఇప్పుడు రాజమౌళి చెప్పిన కరెక్షన్లు కూడా కట్ చేస్తే మరింత తగ్గవచ్చని టాక్ వినిపిస్తోంది. ఇక రాజమౌళి చిన్న చిన్న కరెక్షన్ చెప్పడంతో చిత్ర బృందంలో టెన్షన్ మొదలైంది అన్నది తెలుస్తుంది.