ప్రభాస్-మారుతి సినిమా..హాట్ టాపిక్ గా మారిన డార్లింగ్ రెమ్యూనరేషన్..?

పాన్ ఇండియా హీరో ప్రభాస్..సైలెంట్ కిల్లర్ మారుతి డైరెక్షన్ లో ఓ సినిమా చేయబోతున్నాడన్న విషయం గత కొన్ని నెలలుగా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారుతుంది. ఇప్పటి వరకు ఈ సినిమా పై అఫిషియల్ ప్రకటన రాకపోయినా..బ్యాక్ గ్రౌండ్ లో మాత్రం సినిమాలో నటించే నటీమణుల ఎంపిక కూడా జరిగిపోయింది అంటూ ఓ వార్త నెట్టింట తెగ హల్ చల్ చేస్తుంది. ఆ వార్తల ఆధారంగా..

ప్రభాస్ మారుతి కాంబో లో రాబోతున్న ఆ సినిమాలో ఒకరు, ఇద్దరు కాదు ఏకంగా ముగ్గురు హీరోయిన్ల తో రొమాన్స్ చేయనున్నాడట. అంతేకాదు ఈ సినిమాలో మనం ప్రభాస్ ని ఓ ఢిఫరెంట్ లుక్ లో చూడబోతున్నాం అని..ముఖ్యంగా ప్రభాస్ లోని కామెడీ యాంగిల్ ని మారుతి బాగా చూయించగలడని టాక్ వినిపిస్తుంది. ఇప్పటికే ఈ సినిమాకు రాజా డిలెక్స్ అనే టైటిల్ ని ఫిక్స్ చేసిన్నట్లు తెలుస్తుంది. అన్ని అనుకున్నట్లు జరిగుంటే..ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఎప్రిల్ 11న పెట్టుకోవాలి అనుకున్నారట మేకర్స్.

కానీ, ప్రభాస్ హెల్త్ కండీషన్ బాగోకపోవడంతో..డాక్టర్లు బెడ్ రెస్ట్ చెప్పడంతో..ఈ సినిమా పూజా కార్యక్రమాలు వాయిదా పడిన్నట్లు తెలుస్తుంది. కాగా, ఈ సినిమాకి ప్రభాస్ తీసుకునే పారితోషకం మ్యాటర్ నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. ఇప్పుడు ఒక్కో సినిమాకి 100 నుండి 150 కోట్లు పారితోషకంగా తీసుకునే ప్రభాస్..ఈ సినిమా కోసం కేవలం 60 రోజుల కాల్ షీట్లను మాత్రమే ఇచ్చి..దాదాపు 75 కోట్లు రెమ్యూనరేషన్ గా పుచ్చుకుంటున్నాడట. బాహుబలి తరువాత ప్రభాస్ రేంజ్ మారింది అని తెలుసు కానీ ఈ స్దాయిలో మారిందా అంటూ నెటిజన్స్ ఆశ్చర్య పోతున్నారు. మరికొందరైతే..ఫ్లాప్ సినిమాలు పడుతున్న ఈయన లో ఏం చూసి అంత డబ్బులు ఇస్తున్నారు నిర్మాతలు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.