ప్రభాస్ రేంజ్ ఈ స్థాయికి ఎలా చేరిందో తెలుసా?

ప్రభాస్.. పాన్ ఇండియన్ హీరో. సాహో లాంటి హాలీవుడ్ రేంజ్ సినిమాల్లో నటించి అందరి చేత శభాష్ అనిపించుకున్న నటుడు. టాలీవుడ్ జేమ్స్ బాండ్ గా గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్.. క్రమ శిక్షణకు మారుపేరుగా చెప్పుకోవచ్చు. టాలీవుడ్ నుంచి అంచెలు అంచెలుగా ఎదిగా ప్రస్తుతం బాలీవుడ్ కే ఝలక్ ఇచ్చాడు. ప్రస్తుతం చేస్తున్న.. ఇక ముందు చేయబోతున్న అన్ని సినిమాలు పాన్ ఇండియన్ ప్రాజెక్టులే కావడం విశేషం.

పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో జన్మించి ప్రభాస్.. అసలు పేరు ఉప్పల పాటి వెంకట సూర్య ప్రభాస్ రాజు. ఈయనకు అన్న ప్రబోధ్, చెల్లి ప్రగతి ఉన్నారు. ప్రాథమిక విద్య పశ్చిమ గోదావరిలోనే చేసిన ఆయన బీటెక్ హైదరాబాద్ లో చదివాడు. పెదనాన్న కృష్ణంరాజు నట వారసుడిగా సినిమా పరిశ్రమలో అడుగు పెట్టాడు. 2002లో జయంత్ సీ పరాన్జీ దర్శకత్వంలో ఈశ్వర్ మూవీతో వెండి తెరకు పరిచయం అయ్యాడు. ఈ సినిమా జనాలకు బాగానే నచ్చింది. 2003లో వచ్చిన రాఘవేంద్ర మాత్రం ఫ్లాప్ అయ్యింది. 2004లో శోభన్ దర్శకత్వంలో తెరకెక్కిన వర్షం సినిమా అద్భుతం విజయం సాధించింది. సంతోషం ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ లో ఉత్తమ నటుడి అవార్డు ఆయనను వరించింది. అనంతరం వచ్చిన అడవి రాముడు ఫర్వాలేదు అనిపించింది. కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన చక్రం డిజాస్టర్ అయ్యింది. 2005లో వచ్చిన రాజమౌళి సినిమా ఛత్రపతిలో ప్రభాస్ నట విశ్వరూపాన్ని చూపించాడు. మరో ఫిల్మ్ ఫేర్ అవార్డును అందుకున్నాడు.

2006లో ప్రభుదేవా దర్శకత్వంలో వచ్చిన పౌర్ణమి, వివి వినాయక్ దర్శకత్వంలో 2007లో వచ్చిన యోగి పరాజయం పాలయ్యాయి. 2007 లో వంశీ పైడిపల్లి తీసిని మున్నా యావరేజ్ గా నిలిచింది 2008లో పూరీ జగన్నాథ్ తీసిని బుజ్జిగాడు సినిమా హిట్ అయ్యింది. 2009లో మెహర్ రమేశ్ దర్శకత్వంలో తెరకెక్కింది బిల్లా అదరగొట్టింది. ఆ తర్వాత పూరీ తీసిని ఏక్ నిరంజన్ ఫ్లాప్ అయ్యింది. 2010లో కరుణాకర్ దర్శకత్వంలో వచ్చిన డార్లింగ్ యావరేజ్ గా నిలిచింది. 2011లో వచ్చిన సినిమా మిస్టర్ పర్ ఫెక్ట్ సూపర్ హిట్ అందుకుంది. 2012లో రెబెల్ ఫ్లాప్ అయ్యింది. 2013లో కొరటాల శివ తెరకెక్కించిన మిర్చీ అదరగొట్టింది. ఇక 2015లో రాజమౌళి తీసిని బాహుబలి సినిమా ప్రపంచ వ్యాప్తంగా తన సత్తాను చాటేలా చేసింది. అంతర్జాతీయ హీరోగా ఎదిగాడు. ఆ తర్వాత సుజిత్ దర్శకత్వంలో 2019లో 350 కోట్ల భారీ బడ్జెట్, సూపర్ విజువల్ ఎఫెక్ట్స్ తో వచ్చిన సాహో హాలీవుడ్ రేంజ్ ని తలపించింది. ప్రస్తుతం రాధేశ్యామ్ 400 కోట్లతో నిర్మించారు. విడుదలకు రెడీ అయ్యింది. అటు ఆదిపురుష్ 2023 సంక్రాతికి రానుంది. అటు దీపికా పదుకొణెతో ఆయన తాజాగా ప్రాజెక్ట్ కే చేస్తున్నాడు.

ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ. 200 కోట్లు తీసుకుంటున్నాడు ప్రభాస్. అంతేకాదు.. ప్రపంచంలోనే టాప్ 100లో ఫోర్బ్స్ జాబితాలో ప్రభాస్ చేరాడు. నెలకు దాదాపు 3 కోట్లతో ఏడాదికి 40 కోట్లు సంపాదిస్తున్నాడు ప్రభాస్.