రాధేశ్యామ్ డిజాస్ట‌ర్ టాక్‌కు అంతా సిద్ధం… ప‌క్కా స్కెచ్ వేశారే…!

ఇప్పుడు సినిమాల సంగ‌తి ఎలా ఉన్నా సోష‌ల్ మీడియా టాక్ ముఖ్యం అయిపోయింది. ఒక‌ప్పుడు మీడియాకు ఎవరైజా భ‌య‌ప‌డే వారు. ఇప్పుడు సోష‌ల్ మీడియాకు భ‌య‌ప‌డుతున్నారు. సినిమా షో స్టార్ట్ అవ్వ‌డం ఆల‌స్యం మినిట్ టు మినిట్ సోష‌ల్ మీడియాలో పెట్టేస్తుండ‌డంతో టాక్ సులువుగా వైర‌ల్ అవుతోంది. ఇక అభిమానుల గొడ‌వ‌లు.. రాజ‌కీయాలు ఇవ‌న్నీ సినిమాల‌పై ఎఫెక్ట్ గట్టిగా చూపిస్తున్నాయి.

తాజాగా ప్ర‌భాస్ రాధేశ్యామ్ రిలీజ్ అవుతోంది. ఏపీలో ఐదో షోతో పాటు టిక్కెట్ రేట్లు పెంచుకునేలా జీవో వ‌చ్చింది. పైగా రాధేశ్యామ్‌కు టిక్కెట్ రేట్లు పెంచుకోవ‌చ్చ‌ని ఏపీ మంత్రి స్వ‌యంగా చెప్పారు. అయితే ఇది కొద్ది రోజుల క్రితం రిలీజ్ అయిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ భీమ్లానాయ‌క్ విష‌యంలో ఇవ్వ‌లేదు. భీమ్లానాయక్‌కు ఐదో షో లేదు.. టిక్కెట్ రేట్లు మ‌రీ త‌క్కువ‌గానే ఉన్నాయి.

దీంతో ఇప్పుడు ప‌వ‌న్‌, జ‌నసేన అభిమానుల‌తో పాటు వైసీపీ వ్య‌తిరేక టీం అంతా రాధేశ్యామ్ వైసీపీ అనుకూల సినిమా అంటూ టార్గెట్ చేయ‌డం మొద‌లు పెట్టేసింది. రేపు సినిమా రిలీజ్ రోజు జ‌గ‌న్ ప్ర‌భాస్ సినిమాకు బాగా ఫేవ‌ర్‌గా ఉన్నార‌ని.. ఆ సినిమాను ఏదోలా ప్లాప్ చేయాలంటే ఒక్క‌టే ప్ర‌చారం ప్రారంభించారు. వైసీపీ యాంటీ టీం అంతా ఇప్పుడు ఇదే ప‌నిలో బిజీగా ఉంది.

ఏదేమైనా వాళ్లు బాగానే ఉంటున్నారు.. ప్ర‌చారం చేసుకుని సంతృప్తి పొందుతున్నారు. మ‌ధ్య‌లో సినిమాలు బ‌ల‌వుతున్నాయి. సినిమాల‌ను కొన్నోళ్లు, నిర్మాత‌లు నిండా మునుగుతున్నారు. ఇక‌పై ఈ సంస్కృతికి చెక్ పెడితే మంచిది.