బాలయ్య భార్య వసుంధర బ్యాగ్రౌండ్ తెలుసా.. ఆస్తుల గురించి తెలిస్తే షాకే?

టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి నటసింహం బాలకృష్ణ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 60 ఏళ్ల వయసు దాటిపోతున్నా ఇంకా యువ హీరోలకు పోటీగా వరస సినిమా లతో దూసుకు పోతున్నాడు. కేవలం సినిమాలతోనే సరిపెట్టుకోకుండా ఆహా ఓటీటీ వేదికగా అన్ స్టాపబుల్ అనే కార్యక్రమంతో ఇక హోస్టుగా అవతారమెత్తి అదరగొడుతున్నాడు అన్న విషయం తెలిసిందే. ఇటీవలే తన ఫేవరెట్ డైరెక్టర్ బోయపాటి తో అఖండ సినిమా చేసి బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు.

ఇక ఇప్పుడు గోపీచంద్ మలినేని తో ఒక సినిమాకు రెడీ అయ్యాడు బాలకృష్ణ. ఈ సినిమాపై భారీ రేంజ్ లోనే అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇది అందరూ చెప్పేదే కదా మీ దగ్గర ఏదైనా కొత్త వార్త ఉందా అని అంటారా.. మీకోసం ఇప్పుడు సరికొత్త విషయాన్ని పట్టుకొచ్చాను.. అది బాలయ్య గురించి కాదు బాలకృష్ణ భార్య వసుంధర గురించి. 1982లో బాలయ్య వసుంధర దేవి ని పెళ్లి చేసుకున్నారు. ఈమె శ్రీ రామదాసు మోటార్ ట్రాన్స్పోర్ట్ అధినేత దేవరపల్లి సూర్యరావు కూతురు అని అందరికి తెలిసిందే.

అయితే వందల కోట్ల ఆస్తులకు వారసురాలు అయినా వసుంధరాదేవి గురించి మొన్నటి వరకు ఎవరూ ఆలోచించలేదు.. కానీ ఇటీవలే బాలకృష్ణ హోస్టింగ్ చేస్తున్న అన్ స్టాపబుల్ కార్యక్రమంలో తన భార్యకు ఫోన్ చేసి అందరి ముందే బాలయ్య ఐ లవ్ యు చెప్పడం.. దీనికి రిప్లై గా మీరు నన్ను ఎప్పుడూ లవ్ చేస్తారు అంటూ వసుంధర దేవి చెప్పడంతో ఇక బాలయ్య భార్య బ్యాక్గ్రౌండ్ గురించి తెలుసుకోవడానికి అందరు గూగుల్ తల్లిని ఆశ్రయిస్తున్నారు. అయితే ప్రస్తుతం బాలయ్య సినిమాలో బిజీగా ఉంటే కుటుంబ వ్యవహారాలను వసుంధరాదేవి చూసుకుంటున్నారట ఇక వీరికి ముగ్గురు సంతానం బ్రాహ్మణి తేజస్విని మోక్షజ్ఞ.

బ్రాహ్మణి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తనయుడు లోకేష్ ని పెళ్లి చేసుకున్నారు. ఇక తేజస్విని వైజాగ్ గీతం సంస్థలకు చెందిన శ్రీ భరత్ ను పెళ్లి చేసుకున్నారు. మోక్షజ్ఞ వెండితెరపై హీరోగా పరిచయమై ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాడు అయితే ఇక బాలకృష్ణ కు పెళ్లి సమయంలో మోటార్ ట్రాన్స్పోర్ట్ అధినేత దేవరపల్లి సూర్యరావు ఇక భారీగానే కట్నం ముట్టచెప్పినట్లు టాక్ వుంది. ఇక ఇలా ప్రస్తుతం వసుంధరాదేవి ఆస్తుల విలువ కోట్లలోనే ఉంటుందని టాక్ వైరల్ గా మారిపోయింది.