ప్రభాస్ అభిమానుల కోసం మారుతి సంచలన నిర్ణయం….కేకోకేక అంతే..?

ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రభాస్ అభిమానులు ఆయన రీసెంట్ సినిమా “రాధేశ్యామ్” చూసి కొంచెం డిసప్పాయింట్ అయిన విషయం తెలిసిందే. పాన్ ఇండియా లెవల్ లో తెరకెక్కించిన ఈ సినిమా పై అభిమానులు భారీ ఎక్స్ పెక్టేషన్స్ పెట్టుకున్ని ఉండగా..వాటిని డైరెక్టర్ నిరాశ పరిచారు. ఏదో చించేస్తారు పొడిచేస్తారు అని అనుకున్నారు అంతా. కానీ అక్కడ అసల్ మ్యాటర్ నిల్ అని సినిమా చూశాకనే అర్ధమైంది. దీంతో సినిమా బాక్స్ ఆఫిస్ వద్ద మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకుంది.

అయితే, ప్రభాస్ అభిమానులు ఈ సినిమా ఫ్లాప్ అయ్యిందని బాధలో ఉండగా ..వాళ్ళకి అద్దిరిపోయే గుడ్ న్యూస్ ఇవ్వడానికి టైం ఫిక్స్ చేశారు. ఎప్పటి నుండో..డైరెక్టర్ మారుతి డైరెక్షన్ లో ప్రభాస్ ఓ సినిమా చేస్తున్నాడని..ఆ సినిమా రాజా డిలెక్స్ అనే టైటిల్ ని ఫిక్స్ చేశారని వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. కాగా, ఎట్టకేలకు ఆ న్యూస్ ని నిజం చేస్తూ చిత్ర బృందం అఫిషీయల్ ప్రకటన చేయడానికి రెడీ అయ్యిన్నట్లు తెలుస్తుంది.

అన్ని అనుకున్నట్లు జరిగితే.. ఏప్రిల్ 10న ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు లాంఛనంగా జరగనున్నాయి అని టాక్ వినిపిస్తుంది. అంతేకాదు ఆ రోజే ఈ సినిమాలో హీరోయిన్స్ గా చేయబోతున్న ఇద్దరిని పరిచయం చేస్తారట. మిగిలిన ఒక్క అమ్మాయిన సస్పెన్స్ లో పెట్టనున్నారు మారుతి అంటూ ఓ వార్త నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. నిజానికి ఈ సినిమా డీటైల్స్ మే నెలాఖరున రీవిల్ చేద్దాం అనుకున్నారట. కానీ రాధేశ్యామ్ మూవీ ఇచ్చిన ఝలక్ తో..అభిమానులను హ్యాపీగా ఉంచడానికి ప్రభాస్ నే ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని త్వరగా పూర్తి చేయమన్నారట. ఏది ఏమైనా ప్రభాస్ మరో సినిమా వస్తుంది అంటే అది అభిమానులకు గుడ్ న్యూసే గా..మరి చూడాలి ఈ సినిమాతోనైన ప్రభాస్ హిట్ కొడతాడో లేదో ?