నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా, శృతి హాసన్ హీరోయిన్గా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో #NBK107 ప్రాజెక్ట్ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. అఖండ సినిమా గర్జన తర్వాత బాలయ్య నటించిన సినిమా ఇదే కావడంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. పైగా క్రాక్ లాంటి మాస్ హిట్ తర్వాత దర్శకుడు మలినేని గోపీచంద్ డైరెక్ట్ చేస్తోన్న సినిమా ఇదే.
ఈ సినిమా కంప్లీట్ యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇందులో బాలయ్య ద్విపాత్రాభినయం చేయనున్నట్టు తెలుస్తోంది. రాయలసీమ నేపథ్యంలో పవర్ ఫుల్ యాక్షన్ సినిమాగా ఇది తెరకెక్కుతోందని ప్రచారం జరుగుతోంది. ఇక మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవలే తెలంగాణలోని సిరిసిల్లలో మొదలయ్యింది.
అయితే తాజాగా ఈ సినిమా షూటింగ్ స్పాట్ని అఖండ దర్శకుడు బోయపాటి సందర్శించాడు. ఈ మేరకు బోయపాటి ఈ సినిమా యూనిట్కు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సినిమాలో ప్రముఖ కన్నడ నటుడు దునియా విజయ్ నటిస్తుండగా, తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. వచ్చే దసరాకు ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.