అయ్యయ్యో..ఏంటమ్మ నీకు ఈ పరిస్ధితి..బాధపడిన బాలయ్య..?

గత రెండున్నార సంవత్సరాలుగా కరోనా మహమ్మారి మనల్ని పట్టి పీడిస్తున్న సంగతి తెలిసిందే. చిన్న, పెద్ద తేడా లేకుండా తన క్రూరమైన కొరలతో అమాయకపు ప్రజలని బలితీసుకుంటుంది. ప్రపంచ దేశాలనే గడగడలాడించిన కరోనా మహమ్మారి ఇప్పుడిప్పుడే శాంతిస్తున్నట్లు తెలుస్తుంది. గత కొన్ని నెలలుగా కరోనా కేసులు చాలా తగ్గు ముఖం పట్టాయి. దీంతో మళ్ళీ సాధారణ పరిస్ధితులు వచ్చాయని జనాలు హ్యాపీగా ఫీల్ అవుతున్న క్షణంలోనే మళ్లీ కరోనా కేసులు వెలుగు చూస్తుండటం భయాందోళనలకు గురి చేస్తుంది.

రీసెంట్ గా స్టార్ డాటర్ కమల్ హాసన్ కూతురు శృతి హాసన్ కు కరోనా పాజిటీవ్ వచ్చిన సంగతి తెలిసిందే. ఆమె స్వయంగా తనకు కరోనా పాజిటీవ్ వచ్చిందని..ప్రస్తుతం డాక్టర్ సలహాలు తీసుకుంటూ..హోమ్ ఐసోలేషన్ లో ఉన్నానని..అందరు జాగ్రత్తగా ఉండాలని చెప్పుకొచ్చింది. అయితే తాజాగా ఆమె తన రీసెంట్ పిక్ ని అభిమానులతో పంచుకుంది. ఇక ఆ ఫోటో చూసిన వారు షాక్ అయిపోతున్నారు. అసలు ఆ పిక్ లో ఉండేది శృతి నేనా అంటూ ఆలోచిస్తున్నారు..అంతలా మారిపోయింది శృతి. కళ్ళు లోపలికి వెళ్లిపోయి, నల్లగా కనిపిస్తూ..ఇంకా డల్ గా మొహం లాగేసి..ఆ ఫోటో చూస్తే శృతి కండీషన్ ఏం బాగోలేదు అని అర్ధమౌతుంది.

దీంతో నెటిజన్స్ ఆమె త్వరగా కోలుకోవాలని ప్రార్ధిస్తున్నారు. ఇక నందమూరి నట సింహం బాలకృష్ణ అయితే..ఆమెకు కరోనా అని తెలిసిన మొదలు ఆమె ఆరోగ్యం గురించి ఫాలో అప్ చేస్తూనే ఉన్నారట . ఆమె హెల్త్ కండీషన్ ఎలా ఉందని..ఎటువంటి ట్రీట్ మెంట్ అందిస్తున్నారని అన్ని విషయాలు ఫోన్ ద్వారానే కనుకుంటున్నారట. ఇక శృతి తాజా పిక్ చూసి బాలయ్య బాధపడిన్నట్లు తెలుస్తుంది. వీడియో కాల్ చేసి మరీ ఆమెతో మాట్లాడారట బాలయ్య. ఈ క్రమంలో ఆమె బాగోగులు గురించి అడిగి తెలుసుకుని..త్వరగా కోలుకుంటావ్ తల్లి ..మా దీవెనలు నీకు ఎప్పుడు ఉంటాయి..ఎటువంటి హెల్ప్ కావాలి అన్న అడుగు అంటూ ధైర్యం చెప్పాడట. ఇది తెలుసుకున్న కృష్ణ ఫ్యాన్స్ దట్ ఇజ్ బాలయ్య అంటూ కామెంట్స్ చేస్తున్నారు.