ఫస్ట్ డే ‘రాధే శ్యామ్ ‘చూడబోతున్న టాలీవుడ్ స్టార్ హీరో

రాధా కృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వస్తున్న చిత్రం రాధే శ్యామ్ .ఈ చిత్రం మార్చి 11 న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుంది .అయితే టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కుటుంబ సమేతంగా రాధే శ్యామ్ ని రిలీజ్ రోజు చూడబోతున్నారు .లేటెస్ట్ గా రిలీజ్ అయిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమాని కూడా అల్లు అర్జున్ ఫ్యామిలీతో చూసారు .అయితే బన్నీ మాత్రం ఆ సినిమాపై ఎలాంటి కామెంట్స్ చేయలేదు .ఎందుకంటే ఏపీ సీఎం వై ఎస్ జగన్ ఎక్కడ కోపం వస్తదో అని సైలెంట్ గా ఉంది పోయారు .

బన్నీ ఈ సారి అలాకాకుండా రాధే శ్యామ్ పై పక్కాగా కామెంట్స్ చేస్తాడని అని ఫ్యాన్స్ అనుకుంటున్నారు .ఎందుకంటే బన్నీ ,ప్రభాస్ సినిమాలోకి రాకముందునుండి మంచి ఫ్రెండ్స్ .అయిన ఇంకొక హీరో తన అభిమాన హీరో సినిమా చూసి మంచి కాంప్లిమెంట్స్ ఇస్తే ఫ్యాన్స్కి అంతకన్నా ఇంకేముంటది .రాధే శ్యామ్ లో పూజ హెగ్డే హీరోయిన్గా నటిస్తున్న సంగతి తెలిసిందే .