ఆయనతో ఓ సారి అలా..వామ్మో..పూజా ఓపెన్ గా చెప్పేసిందిగా..?

పూజా హెగ్డే..పాప మంచి స్వింగ్ మీద ఉన్నట్లు తెలుస్తుంది. ఒకప్పుడు ఐరెన్ లెగ్ గా పేరు తెచ్చుకున్న ఈ అమ్మడు ఇప్పుడు..గొల్డెన్ లెగ్ గా మారిపోయింది. ఇప్పుడు ప్రతి డైరెక్టర్ కి,హీరోకి ,నిర్మాతలకి పూజానే కావలి. ఆమె కాల్ షీట్ల కోసం సినిమా నే వాయిదా వేసుకుంటున్నారు. అంతలా తన రేంజ్ ను మార్చేసుకుంది ఈ బ్యూటీ.

దాదాపు టాలీవుడ్ లో అందరి హీరోలతో కలిసి నటించిన ఈ అమ్మడు ప్రజెంట్ ప్రభాస్ తో నటించిన రాధేశ్యామ్ సినిమా రిలీజ్ కు సిద్దంగా ఉంది. ఆ తరువాత చరణ్ తో కలిసి నటించిన ఆచార్య కూడా రిలీజ్ కు రెడీగా ఉంది. ఈ సినిమాలు రిలీజ్ కాకుండానే అమ్మడు బడా బడా ఆఫర్లను తన చేతిలో పెట్టుకుని అటు బాలీవుడ్-ఇటు టాలీవుడ్ రెండు ఇండస్ట్రీలను ఏలేస్తుంది.

అయితే తాజాగా రాధేశ్యామ్ చిత్ర ప్రమోషన్స్ లో పాల్గోన్న ఆమెకు..”మీరు ఇప్పటి వరకు నటించని ఏ హీరోలతో నటించాలనుకుంటున్నారు” అని అడగ్గా.. పూజా సమాధనమిస్తూ..” ముందు కమల్‌హాసన్‌, ఆ తరువాతరణ్‌బీర్‌ కపూర్‌, ఇక ఆ తరువాత ధనుష్‌లతో నటించాలనుకుంటున్నట్లు చెప్పింది. ఇప్పటికే తమిళంలో బీస్ట్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది కాబట్టి..ధనుష్,కమల్ తో చేసే ఛాన్సెస్ ఖచ్చితంగా అందుకుంటుంది. ఇక రణ్ బీర్ విషయానికి వస్తే..పూజాతో రొమాన్స్ కి అలియా ఒప్పుకుంటుందా..?అనే సందేహాలు చాలా మందికి ఉన్నాయి. మరి చూడాలి ఈ పొడుగు కాళ్ల సుందరి కోరిక ఎప్పుడు తీరుతుందో..అమ్మడు లక్‌ చూస్తుంటే త్వరలోనే ఆమె కోరిక తీరేలా కనిపిస్తుంది అంటున్నారు ఫ్యాన్స్.