కీర్తి తప్పించుకుంది..రష్మిక బలైపోయింది..ఇండస్ట్రీలో హాట్ టాపిక్ ఇదే..?

“ఆడవాళ్ళు మీకు జోహార్లు”..శర్వానంద్ హీరోగా-రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం రీసెంట్ గానే రిలీజై మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకుంది. తిరుమల కిషోర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో ముఖ్య పత్రల్లో ఒకప్పటి స్టార్ హీరోయిన్లు ..రాధిక,ఖుష్బు నటించి మెప్పించారు. నిజం చెప్పాలంటే ఈ సినిమాలో హీరోయిన్ నటన కన్నా కూడా ఖుష్బు పర్ ఫామెన్స్ నే బాగుంది.. నటనకు స్కోప్ ఉన్న పాత్ర ఇది అని అంతా అనుకుంటున్నారు.

శర్వానంద్ సినిమా అంటే అందులో కచ్ఛితంగా ఏదో ఒక ప్రత్యేకత ఉంటుందనే నమ్మకం ఏర్పడింది అభిమానులకి. సినిమా హిట్ కాకపోయిన పాజిటివ్ టాక్ తెచ్చుకుంటాయి ఈయన సినిమాలు. కానీ , ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ సినిమా మాత్రం శర్వాకు కన్నీళ్లే మిగ్ల్చింది. హిట్ కాలేదు కదా.. కనీసం పాజిటీవ్ టాక్ ను కూడా తెచ్చుకోలేకపోయింది. కామన్ స్టోరీనే కావడం.. చెప్పుకోతగ్గ స్క్రీన్ ప్లే లేకపోవడం తో బాక్స్ ఆఫిస్ వద్ద ఈ సినిమా బోల్తా పడింది. ఈ సినిమాతోనైనా మళ్లీ ఫాంలోకి వస్తాను అనుకున్నాడు శర్వా..కానీ, ఆడవాళ్ళు మీకు జోహార్లు సినిమా విషయంలో అలాంటి అంచనాలేం నెలకొనలేదు.

కాగా, ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన రష్మిక కూడా తన నటన పై బ్యాడ్ కామెంట్స్ తెచ్చుకునేలా చేసుకుంది. ఇలాంటి సినిమాని నువ్వు ఎందుకు ఒప్పుకున్నవ్ రష్మిక అంటూ కామెంట్స్ చేస్తున్నారు అభిమానులు. అయితే, మొదట ఈ సినిమాలో హీరోయిన్ గా అనుకుంది కీర్తి సురేష్ నట. ఆమె అయితే కళ్లతోనే ఎక్స్ ప్రేషన్స్ ని బాగా పలికించగలదు..పెళ్లి చూపుల ఎమోషన్స్ సీన్స్ కూడా బాగా హైలెట్ అవుతాయి అనుకుని డైరెక్టర్ ఆమెని అప్రోచ్ అవ్వగా..అప్పటికే కీర్తి కాల్ షీట్లని ఫిల్ అయిపోయాయని చెప్పడంతో ఆయన రష్మిక ను హీరోయిన్ గా తీసుకున్నారట. కానీ ఈ విషయం బయటకు వచ్చాక. రష్మిక కన్నా కూడా కీర్తినే బెటర్ పర్ ఫామెన్స్ ఇచ్చుండేది అంటున్నారు పలువురు నెటిజన్స్..ఏది ఏమైన శర్వ కెరీర్ ప్రాబ్లం లో ఉందని చెప్పక తప్పదు.