కృష్ణాజిల్లాకు చెందిన కొడాలి నాని, పేర్ని నానిల విషయం వైసీపీలో ఆసక్తిగా మారింది. ఇద్దరు నానీలు కూడా 2019లో విజయం దక్కించుకున్నారు. వీరిలో కొడాలి అయితే..వరుసగా విజయాలు దక్కించుకు న్నారు. పేర్ని మాత్రం మధ్యలో పరాజయం పాలయ్యారు. గత ఎన్నికల్లో జగన్ సునామీ.. ఆయన హవాతో విజయం దక్కించుకున్నారు. అంతేకాదు.. ఇద్దరికీ ..జగన్ మంత్రి పదవులు కూడా ఇచ్చారు. మొదట్లో పేర్ని నాని సైలెంట్గా ఉండేవారు. కొడాలి నాని.. ఆది నుంచి ఉన్న ఫైర్ను చూపిస్తున్న విషయం తెలిసిందే.
పేర్ని.. మాత్రం ఇటీవల ఇటీవల కాలంలో ఫైర్ బ్రాండ్ అంత కాకపోయినా.. ఆ రేంజ్లో వ్యాఖ్యలు చేస్తు న్నారు. దీంతో పార్టీలో ఏ విషయంపైనైనా.. ఇద్దరు నాయకులు మాట్లాడితే.. ప్రతిపక్షాలకు జడుపే.. అఏ వ్యాఖ్య లు వినిపించేలా చేశారు. అయితే.. ఇప్పుడు ఈ నాయకుల విషయంపై అనుచరులు దిగులు పెట్టుకున్నారట. ఎందుకంటే.. ఉగాది నాటికి మంత్రి వర్గ ప్రక్షాళన ఉంటుంది. గతంలో జగన్ చేసిన ప్రకటన మేరకు.. మంత్రులనను 90 శాతం మందినీ మార్చేస్తే.. ఈ ఇద్దరునానిలలో ఎవరు ఉంటారు? ఎవరు పోతారు? అనే చర్చ సాగుతోంది.
వాస్తవానికి సీఎం జగన్ దృష్టిలో ఇద్దరూ కూడా కావాల్సిన వారే. ఎందుకంటే.. సామాజిక వర్గాలను ప్రభావి తం చేయగల స్థాయి ఇద్దరికీ ఉంది. ఒకరు కమ్మ అయితే.. మరొకరు కాపు. సో.. ఇద్దరినీ జగన్ దాదాపు ఒకే విధంగా చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎవరిని ఉంచుతారు? ఎవరిని పక్కన పెడతారు? అనేది ఆసక్తికర విషయంగా మారింది. ఇక, జిల్లా పరంగా చూస్తే.. జోగి రమేష్, ఉదయ భాను, వసంత కృష్ణప్రసాద్, మల్లాది విష్ణు, కొలుసు పార్థసారథి.. ఇలా.. కీలకమైన నాయకులు మంత్రి పదవుల రేసులో ఉన్నారు. అయితే.. వీరు నానీల మాదిరిగా పార్టీ తరఫున, ప్రభుత్వం తరఫునా.. మద్దతుగా మాట్లాడగలరా? అననేది ప్రశ్న.
సో.. కొడాలి మాదిరిగా వీరు మాట్లే పరిస్థితి లేదు. ఒకవేళ జోగి విరుచుకుపడినా.. కొడాలి మాదిరిగా .. మాత్రం ఏ విషయాన్నయినా.. అనూహ్యంగా అందిపుచ్చుకునే సత్తా ఆయనకు లేదని.. పార్టీ వర్గాలే చెబుతున్నాయి. మరోవైపు.. ఇతర నేతలను చూస్తే..వారు ఫైర్ బ్రాండ్స్ ఏమీ కాదు. పైగా.. వసంత తొలిసారి ఎమ్మెల్యే. ఈ నేపథ్యంలో నానీలను మార్చే అవకాశం లేదని.. కొందరు అంటుంటే.. కొత్తవారికి అవకాశం ఇవ్వాలి కనుక.. వారిని మంత్రి పదవులను నుంచి టెక్నికల్గా పక్కన పెట్టినా.. వారిఇమేజ్నుతగ్గించే ప్రయత్నం మాత్రం జగన్ చేయబోరని మరికొందరు చెబుతున్నారు. ఎలా చూసుకున్నా.. నానీలు సేఫ్ జోన్లో నే ఉన్నారని అంటున్నారు.