బాల‌య్యకు షాక్ ఇచ్చిన మ‌రో హీరోయిన్‌.. నో చెప్పేసిందిగా…!

యువ‌ర‌త్న నందమూరి బాలకృష్ణ హీరోగా వరుస సినిమాలు రూపొందుతున్నాయి. అఖండ సినిమా ఇచ్చిన సక్సెస్ జోష్ తో బ్యాక్ టు బ్యాక్ గోపీచంద్ మలినేని – అనీల్ రావిపూడి సినిమాలు లైన్లో పెట్టేశాడు. ఆ త‌ర్వాత సంప‌త్ నంది ద‌ర్శ‌క‌త్వంలో కూడా మ‌రో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. మ‌లినేని గోపీచంద్ సినిమా ద‌స‌రాకు ప్రేక్ష‌కుల ముందుకు తీసుకు వ‌చ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు.

ఆ త‌ర్వాత అనిల్ రావిపూడి సినిమా ఉంటుంది.. ఇక బాల‌య్య‌కు గ‌త కొన్ని సినిమాల నుంచి హీరోయిన్ల విష‌యంలో ఇబ్బందులు త‌ప్ప‌డం లేదు. తాజాగా మ‌లినేని గోపీచంద్ సినిమా విష‌యంలోనూ ఈ స‌మ‌స్యే వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది. ముందుగా ఈ సినిమాలో శృతీహాస‌న్‌ను హీరోయిన్‌గా తీసుకున్నారు. కోలీవుడ్ సీనియ‌ర్ హీరోయిన్ వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కూడా మ‌రో పాత్ర‌లో న‌టిస్తోంది.

సినిమాలో బాలయ్య ద్వి పాత్రాభినయం అనే వార్తలు వస్తున్నాయి. సినిమాలో కీలక పాత్ర కోసం కృతి శెట్టిని అనుకుంటున్నారట‌. బాల‌య్య కుమార్తె పాత్ర‌కోసం కృతిశెట్టిని సంప్ర‌దిస్తే ఆమె నో చెప్పేసింద‌ని అంటున్నారు. కృతి ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ హిట్ల‌తో దూసుకుపోతోంది. ఉప్పెన సినిమా తర్వాత ఆమె స్థాయి అమాంతం పెరిగింది. ఆ తర్వాత వచ్చిన శ్యామ్ సింగ రాయ్ మరియు బంగార్రాజు సినిమాలు ఆమె రేంజ్ పెంచేశాయి.

ఈ టైంలో బాల‌య్య సినిమాలో.. అందులోనూ కూతురు పాత్ర వేస్తే క్రేజ్ త‌గ్గుతుంద‌నే ఆమె ఈ పాత్ర‌కు నో చెప్పింద‌ని అంటున్నారు. మ‌రి ఈ ప్లేస్లోకి ఎవ‌రు వ‌స్తారో ? చూడాలి.