ఇటీవల కాలంలో సీనియర్ హీరయిన్లు చాలా గ్యాప్ తర్వాత రీ ఎంట్రీ ఇస్తున్నారు. నదియా లాంటి వాళ్లు రీ ఎంట్రీలో కూడా ఇలా అదరగొడుతున్నారో చూస్తూనే ఉన్నాం. ఈ లిస్టులోనే ఇప్పుడు మరి కొందరు సీనియర్ హీరోయిన్లు కూడా వెండితెరపై రీ ఎంట్రీకి రెడీ అవుతున్నారు. ఈ క్రమంలోనే ఒకప్పుడు ఓ ఊపు ఊపేసిన సీనియర్ హీరో రాధ ఇప్పుడు రీ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది.
సూపర్స్టార్ మహేష్బాబు సినిమా ద్వారా ఆమె రీ ఎంట్రీకి రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. రాధ 1980వ దశకంలో ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసింది. మెగాస్టార్ చిరంజీవి – రాధ కాంబినేషన్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. రాధ – చిరు కాంబినేషన్ అంటే పెద్ద క్రేజ్. ఆ తర్వాత పెళ్లి చేసుకున్న రాధ చాలా యేళ్ల పాటు అసలు ఇండస్ట్రీకి దూరమైంది.
అయితే తన ఇద్దరు కుమార్తెలు పెద్దయ్యాక వాళ్లను హీరోయిన్లుగా చేసేందుకు రాధ చాలా కష్టపడింది. రాధ పెద్ద కుమార్తె కార్తీక రంగం, దమ్ము సినిమాలలో నటించింది. దమ్ములో ఎన్టీఆర్ పక్కన నటించినా ఆమెకు క్రేజ్ రాలేదు. ఆ తర్వాత చిన్న కుమార్తె తులసిని మణిరత్నం కడలి సినిమాతో హీరోయిన్ను చేసింది. ఆ సినిమా ప్లాప్ అయ్యాక తులసి కూడా అడ్రస్ లేకుండా పోయింది. రాధ వారసత్వంతో హీరోయిన్లు అయిన ఇద్దరు కుమార్తెలు ఏ మాత్రం నిలదొక్కుకోలేకపోయారు.
ఇక ఇప్పుడు ఆమే స్వయంగా రీ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతోంది. ప్రస్తుతం మహేష్ సర్కారు వారి పాట సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో మహేష్కు తల్లిగా రాధ కనిపించబోతోందట. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభమైంది. మరి రాధ మహేష్ సినిమాలో కనిపిస్తే.. ఆ పాత్రను త్రివిక్రమ్ రక్తికట్టిస్తే రాధ సెకండ్ ఇన్సింగ్ గొప్పగా స్టార్ట్ అయినట్టే..?