ఎన్టీఆర్ సరసన జాన్వీ .. అసలు మ్యాటర్ లీక్ చేసిన బోనీ కపూర్..!!

జాన్వీ కపూర్..మనకు బాగా తెలిసిన పేరే. దివి నుండి భువికి వచ్చినా దేవకన్యలా ఉండే అలనాటి హీరోయిన్ శ్రీదేవి ముద్దుల కూతురు. శ్రీదేవి అందం,నటన గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. ఏ క్యారెక్టర్లో నైన ఓదిగిపోయి ఇట్టే నటించడం ఆమె సొంతం. ఇక అలాంటి హీరోయిన్ కడుపున పుట్టిన అమ్మాయి అంటే ఎలా ఉంటుంది. డబుల్ డోస్ పర్ ఫామెన్స్ ఇచ్చేలా ఉండాలి..అయితే జాన్వీ అంతకుమించి ఇస్తుంది. నటన పరంగా పర్లేదు అని అనిపించినా..అందాల ఆరబోతల విషయంలో మాత్రం , జాన్వీ పాప అస్సలు మొహమాటమనేదే పడదు.

బాలీవుడ్ లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి జాన్వీ పాప తల్లికి తగ్గ కూతురు అని అనిపించుకుంటుంది. చేసింది కొన్ని సినిమాలే అయినా నటన పరంగా మంచి మార్కులు వేయించుకుంది. అయితే గత కొంత కాలంగా అమ్మడు తెలుగు ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా రాబోతుందని..నందమూరి యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమాలో హీరోయిన్ గా ఫిక్స్ అయ్యిందని వార్తలు వినిపిస్తున్నాయి. శ్రీదేవి కి కూడా తన కూతురిని పెద్ద హీరోయిన్ చేయాలి అని..తనకన్నా మంచి పేరు సంపాదించుకోవాలని అనుకునేదట. కానీ కూతురిని హీరోయిన్ గా చూడకుండానే కన్నుమూసింది.

కాగా తారక్ కెరీర్ లో 31 వ సినిమా గా వస్తున్న చిత్రంలో శ్రీదేవి కూతురు జాన్వీ హీరోయిన్ గా నటిస్తుందని అటు బాలీవుడ్ ఇటు టాలీవుడ్ మీడియా కొడైకూసింది. అయితే రీసెంట్ గా వాలిమై సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరైన బోనీ కపూర్ కు ఇదే ప్రశ్న ఎదురైంది. దీని కి ఆయన సమాధానమిస్తూ..అసలు మ్యాటర్ లీక్ చేశాడు. బోనీ మాట్లాడుతూ..” అసలు ఇప్పటి వరకు నా వద్దకు అలాంటి ఆఫర్ నే రాలేదు. సోషల్ మీడియాలో వచ్చే అని వార్తలను నమ్మకండి. దానిని ఫాలో అయితే పిచ్చి వాళ్లం అయిపోతాం. జాన్వీ ఖచ్చితంగా తెలుగు నటిస్తుంది. కాని మంచి స్క్రిప్ట్ దొరకడం లేదు. నచ్చిన కధ దొరికితే ఆమె తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెడుతుంది. జాన్వీ ఆమె తల్లి శ్రీదేవి వారసత్వాన్ని కొనసాగిస్తుందని”..క్లారిటీ ఇచ్చారు.