కుటుంబ వ్యవస్థకు బీటలు.. వరుసగా విడిపోతున్న సెలబ్రిటీ జంటలు..

భారతదేశం అంటేనే కొన్ని పద్దతులు, కట్టుబాట్లు, ఆచారాలు, వ్యవహారాలున్నాయి. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలతో సంతోషంగా ఉండేది. అయితే రాను రాను పరిస్థితుల్లో మార్పులు వచ్చాయి. ఉమ్మడి కుటుంబాల్లో పొసగలేక.. విడిపోయేవారు. అలా ఉమ్మడి కుటుంబాలు కాస్త.. కుటుంబాలుగా మారిపోయాయి. ఇప్పుడు భార్య భర్తల మధ్య కూడా సఖ్యతలేకుండా పోతుంది. ఒకప్పుడు ఎన్ని కష్టాలు వచ్చినా కలిసి ఎదుర్కొనేవారు. కానీ ఇప్పుడు చిన్న చిన్న విషయాలకే భార్య భర్తలు విడిపోతున్నారు. కుంటుంబాల్లో ఏర్పడే అపార్థాలతో చాలా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ప్రస్తుతం భారతీయ కుటుంబ వ్యవస్థలో విడాకులు అనేవి రోజు రోజుకు పెరిగిపోతున్నాయి.

సాధారణ కుటుంబాలేకాదు.. సెలబ్రిటీలు సైతం ఇందుకు మినహాయింపు ఏమీ కాదు. గతేడాది చివర్లో అక్కినేని హీరో నాగ చైతన్య, ఆయన భార్య, ప్రముఖ హీరోయిన్ సమంతా కూడా విడిపోయారు. అక్కినేని కుటుంబం నుంచి వస్తున్న ఆయా వత్తిళ్లను తట్టుకోలేక సమంతా విడిపోయినట్లు వార్తలు వచ్చాయి. అటు బాలీవుడ్ టాప్ హీరో అమీర్ ఖాన్ సైతం తన భార్య కిరణ్ రావు నుంచి విడిపోతున్నట్లు ప్రకటించాడు. అటు బాలీవుడ్ హాట్ జంట అర్జున్ కపూర్- మలైకా కూడా విడిపోతున్నారనే వార్త సంచలనం అయ్యింది. కానీ ఆ వార్తలు అవాస్తం అని వెల్లడించారు.

తాజాగా కోలీవుట్ టాప్ హీరో ధనుష్, ఆయన భార్య సౌందర్య విడిపోతున్నట్లు ప్రకటించాడు. ఈ విషయం ప్రస్తుతం కోలీవుడ్ తో పాటు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. 18 ఏండ్ల వివాహ బంధానికి ఫుల్ స్టాప్ పెట్టడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. నిన్నమొన్నటి వరకు అన్యోన్యంగా కనిపించిన ఈ జంట అకస్మాత్తుగా విడిపోవడంతో షాక్ కలిగించింది. అటు చిరంజీవి చిన్న కూతురు శ్రీజ కూడా తన రెండో భర్త కల్యాణ్ దేవ్ తో విడిపోతున్నట్లు వార్తలు వచ్చాయి. అటు బాలీవుడ్ బ్యూటీ సుశ్మితా సేన్, మోడల్ రోహ్మన్ షాల్ నుంచి విడిపోతున్నట్లు ప్రకటించింది. మొత్తంగా దేశంలో ప్రస్తుతం విడాకుల అంశం ఆందోళనకు గురి చేస్తుంది.