వరుడు కావలెను సినిమాకి ఎన్ని కోట్లు నష్టమో తెలుసా..?

హీరో నాగ శౌర్య, హీరోయిన్ రీతూ వర్మ జంటగా కలిసి నటించిన చిత్రం వరుడు కావలెను. ఈ సినిమాకి డైరెక్టర్ గా లక్ష్మీ సౌజన్య వహించింది. ఈ సినిమా నుండి విడుదలైన టీజర్, ట్రైలర్ కు మంచి స్పందన రావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్టుగానే టాక్ ను బాగా సొంతం చేసుకుంది. కానీ కలెక్షన్ల పరంగా బాక్సాఫీసు వద్ద తన సత్తాను చూపించలేకపోయింది.

ఈ చిత్రం క్లోజింగ్ కలెక్షన్స్ విషయానికి వస్తే..

1). నైజాం-1.30 కోట్లు.
2). సీడెడ్-52 లక్షలు.
3). ఉత్తరాంధ్ర-55 లక్షలు.
4). గుంటూరు-37 లక్షలు.
5). ఈస్ట్-31 లక్షలు.
6). వెస్ట్-26 లక్షలు.
7). కృష్ణ-34 లక్షలు.
8). నెల్లూరు-23 లక్షలు.

ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కలెక్షన్ల విషయానికి వస్తే..3.88 కోట్ల రూపాయలను సంపాదించింది. ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల విషయానికి వస్తే..5.08 కోట్ల రూపాయలను సంపాదించింది.

ఈ సినిమా థియేటర్లు బిజినెస్ విషయానికొస్తే 8.44 కోట్ల రూపాయలు జరగగా ఈ చిత్రం ముగిసే సమయానికి 5.08 కోట్ల రూపాయలు మాత్రమే రాబట్టింది. దీంతో బయ్యర్లకీ 3.47 కోట్ల రూపాయల నష్టాన్ని మిగిల్చింది.