వరుడు కావలెను సంగీతానికి చీఫ్ గెస్ట్ గా స్టార్ హీరోయిన్..!

నాగ శౌర్య రీతువర్మ హీరోహీరోయిన్లుగా కలిసి నటిస్తున్న చిత్రం వరుడు కావలెను. ఈ చిత్రంలో ముఖ్యమైన పాత్రలో హీరోయిన్ నదియా, మురళి శర్మ, వెన్నెల కిషోర్ వంటి వారు నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి టీజర్ కూడా విడుదల కావడం జరిగింది. ఈ టీజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. ఇక ఈ సినిమాకి డైరెక్టర్ గా లక్ష్మీ సౌజన్య తొలి దర్శకురాలిగా పరిచయం అవుతుంది.

ఇక ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ హీరో రానా విడుదల చేయడం జరిగింది. ట్రైలర్ చూసిన వారంతా ఈ సినిమా తప్పకుండా సక్సెస్ అవుతుందని తెలియజేస్తున్నారు. ఇక అంతే కాకుండా ఈ చిత్రానికి సంగీత కార్యక్రమం రేపు సాయంత్రం 6 గంటలకు ఐటీసీ కోహినూర్ వద్ద నిర్వహించనున్నారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ నటి స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే రానున్నది. ఈ సినిమాను ఈనెల 29వ తేదీన విడుదల చేసేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఏదిఏమైనా ఈ చిత్రం తో నైనా నాగశౌర్య మంచి హిట్ కొట్టాలని భావిద్దాం.