రాధేశ్యామ్ సినిమాలో ఆ సీను కోసం ఏకంగా అన్ని కోట్ల..!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, పూజా హెగ్డే హీరోయిన్ గా రాధాకృష్ణ డైరెక్షన్ లో వస్తున్న పిరియాడిక్ లవ్ స్టోరీ సినిమా రాధే శ్యామ్. ఈ సినిమా ఇంత భారీ బడ్జెట్ తో నిర్మించబడుతుంది. తాజాగా ఈ సినిమాలో ఒక సన్నివేశాన్ని కి ఏకంగా 50 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేస్తున్నట్లుగా సమాచారం. ఆ సీన్ ఏదో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం.

ఈ సినిమా క్లైమాక్స్ షూటింగ్ జరుగుతోంది ప్రస్తుతం. ఈ సీన్ ఒక ప్రత్యేకంగా ఉంటుందని ఇటీవలే చిత్ర యూనిట్ సభ్యులు తెలియజేశారు. అయితే మూవీ మేకర్స్ కేవలం క్లైమాక్స్ కోసమే 50 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నట్లు గా చిత్ర యూనిట్ సభ్యులు తెలియజేశారు. అంతేకాదు ఈ క్లైమాక్స్ దాదాపుగా 15 నిమిషాల పాటు చిత్రీకరించబడుతోంది అని చెప్పుకొచ్చారు.

ఈ సీన్ ప్రేక్షకులను బాగా కలిసొస్తుందని నమ్మకంతో ఈ సినిమా లో ఈ సీన్ కోసం అంత ఖర్చు చేస్తున్నట్లు గా తెలుపుకువచ్చారు. ఇదే సినిమాలు హీరోయిన్ పూజ హెగ్డే నటిస్తున్న విషయం కూడా తెలిసిందే. ఈ సినిమా విడుదల కోసం ప్రభాస్ అభిమానులు ఎంతగానో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు.