పెళ్లి పరుగు మూవీ ఫస్ట్ పోస్టర్ విడుదల.. మామూలుగా లేదుగా?

శరవణ సోహాసింగ్ హీరోగా, దర్శకుడిగా పరిచయం అవుతున్న తాజా చిత్రం పెళ్లి పరుగు. ఈ సినిమా సాషా ప్రొడక్షన్ పతాకం పై నిర్మిస్తున్నారు. దివ్యశ్రీ హిరని, ఎంపీ రాజా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా పెళ్లి ఫోటోలు తీసే కొడుకు కి ఒక తండ్రికి మధ్య జరిగే కథనే ఈ సినిమా యొక్క ముఖ్య ఉద్దేశం. సినిమా సహజమైన కథాంశం ఉల్లాసంగా నవ్వుకునే కామెడీ సన్నివేశాలతో జరిగే పెళ్లి వేడుక ఈ పెళ్లి పరుగు కథ అని మూవీ మేకర్స్ తెలిపారు.

ఇది ఇలా ఉంటే తాజాగా దసరా పండుగ సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసారు మూవీ మేకర్స్. ఈ సందర్భంగా ఈ సినిమా హీరో,దర్శకుడు శరవణ సోహాయంగ్ మాట్లాడుతూ.. పెళ్లి పరువు సినిమా ఒక అందమైన కుటుంబం కథ. ఈ సినిమా చాలా నాచురల్ గా ఉంటుంది. అలాగే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కూడా పూర్తయింది. ఇక దసరా పండుగ సందర్భంగా మా చిత్ర యూనిట్ మొదటి పోస్టర్ ను విడుదల చేశాం అని తెలిపారు. ఇందులో నటీనటుల విషయానికి వస్తే శరవణ సోహాయంగ్, మానస నారాయణ్, కిట్టయ్య, చిత్తూరు కుర్రాడు, ఎస్ పీ రాజా తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.