బిగ్ బ్రేకింగ్: మా ఎన్నికల్లో రిగ్గింగ్ జర్గింది, ప్రకాష్ రాజ్ తరుపున దొంగ ఓటు..!

ఈరోజు మా ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే.. అయితే.. తాజాగా మంచు విష్ణు ప్యానెల్ వాళ్ళు అలాగే ప్రకాష్ రాజ్ ప్యానెల్ వాళ్ళు బయట రసవత్తరంగా హడావిడి చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా జరిగిన పోలింగ్ లో రిగ్గింగ్ లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.. ఆ విషయాలు ఏంటోఇప్పుడు చూద్దాం

మా ఎన్నికలలో ప్రకాష్ రాజ్ తరపు వారు ఎవరో గుర్తు తెలియని వ్యక్తి ప్రకాష్ రాజ్ తరఫున ఒక దొంగ ఓటు వేశారు అని జరిగింది. అని మంచు విష్ణు ప్యానెల్ వాళ్ళు ఆరోపిస్తున్నారు . అంతేకాదు ఎన్నికల అధికారి కూడా దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. రాజకీయ ఎన్నికల కంటే మరింత దారుణంగా రిగ్గింగ్ చేస్తూ దొంగ ఓట్లు వేసుకున్నారని ఒకరికొకరు దూషించు కుంటున్నారు. ఇకపోతే ఈ గొడవ ఎంతవరకు దారితీస్తుందో అని సినీ ఇండస్ట్రీలో పెద్దలు ఒకవైపు ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే, వీరు మాత్రం ఎవరికి తోచింది వాళ్ళు దొంగ ఓట్లు వేయించుకోవడానికి సన్నాహాలు సిద్ధం చేసుకుంటున్నారని పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి.