బీహార్ లో వైరల్ అవుతున్న యాక్టర్ రామిరెడ్డి..?

తెలుగు చిత్ర పరిశ్రమలో.. ఒకప్పుడు తన విలనిజంతో ఆకట్టుకున్నాడు రామిరెడ్డి. కొన్నేళ్ళ క్రితం అనారోగ్య కారణంగా కన్నుమూసిన సంగతి మనకు తెలిసిందే. అంకుశం సినిమాతో ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ నటుడు. అంకుశం అనే పేరును కూడా తన ఇంటి పేరుగా మార్చుకున్నాడు.

తాజాగా సోషల్ మీడియాలో మరొకసారి తెరపైకి వచ్చింది. కాకపోతే తెలుగు రాష్ట్రాలలో కాదు బీహార్ రాష్ట్రంలో రామిరెడ్డి పేరు హాట్ టాపిక్ గా మారింది. అక్టోబర్ 22న కేంద్రమంత్రి అమిత్ షా పుట్టిన రోజు ప్రముఖులు చాలామంది విష్ చేశారు. కానీ బీహార్ కు చెందిన జనతాదళ్ సురేంద్ర ఎమ్మెల్యే యాదవ్ మాత్రం అమిత్ షా కు జన్మదిన శుభాకాంక్షలు చెబుతూ అంకుశం రామిరెడ్డి ఫోటో పెట్టడంతో ఈ ఫోటో వైరల్ గా మారుతుంది.

శ్రీధర్ యాదవ్ 1990 నుంచి బెల్గాంజి నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఒకసారి ఎంపిక కూడా ఎన్నికయ్యారు. ఇక ఈ విషయం ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్ గా మారుతోంది.