అగ్రనటులందరినీ కాదని.. ఆయనే కావాలంటూ పట్టుబట్టిన పునీత్..!!

పునీత్ రాజకుమార్ మరణం యావత్ భారత దేశాన్ని కలచివేసింది.. ఇక ఆయన మరణం పై పలువురు ప్రముఖులు, అభిమానులు, తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు..మరికొంతమంది అయితే ఆయనతో ఉన్న జ్ఞాపకాలను కూడా గుర్తు చేసుకోవడం గమనార్హం. ఇకపోతే ప్రముఖ హాస్యనటుడు డానిష్ సైత్ పునీత్ మరణవార్త విని తీవ్ర ఉద్వేగానికి గురయ్యారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. నా హృదయం ముక్కలైంది మాటల్లో చెప్పలేని బాధ ఇది.. నా గురువు, నా హీరో, ఒక గొప్ప వ్యక్తి ఇక ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు అంటూ పునీత్ తో వున్న అనుబంధాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు..

అంతేకాదు అమెజాన్ ప్రైమ్ వీడియో కి చెందిన కొంతమంది వ్యక్తులు చెప్పిన విషయాలను కూడా డానిష్ వెల్లడించారు.. కొంతకాలం క్రితం అమెజాన్ నిర్వహించిన కార్యక్రమంలో ఆ సంస్థ వ్యవస్థాపకుడైన జెఫ్ బెజోస్, పునీత్ రాజ్ కుమార్ ఇద్దరు హాజరయ్యారు.. సినీ పరిశ్రమకు చెందిన ఎంతో మంది వ్యక్తులు అక్కడికి రావడం , వాతావరణం అంతా కోలాహలంగా మారింది.. కొంతమంది అయితే జెఫ్ బెజోస్ తో ఫోటో దిగడానికి ఆసక్తి చూపించారు.. కానీ పునీత్ మాత్రం ఎటువంటి హడావుడీ లేకుండా దూరంగా ఒక పక్కన నిల్చుని ఉన్నారు.

అప్పుడు ఆయన దగ్గరకు అమెజాన్ సిబ్బంది వచ్చి అప్పు మీరెందుకు ఎవరితో ఫోటోలు దిగికుండా ఒక పక్కనే ఉన్నారు.. మీకు కావాల్సిన వ్యక్తి పేరు చెప్పండి.. వారిని మేము మీ దగ్గరికి తీసుకొస్తాం అంటూ అడిగారు.. నిజమా..? అయితే నేను పంకజ్ త్రిపాఠి ని కలవాలి అనుకుంటున్నాను అని నవ్వుతూ సమాధానం ఇచ్చారట.. మన చుట్టూ ఎంత మంది ఉన్నా సరే మా అన్న ప్రతిభను గుర్తిస్తారు అలాగే మంచితనాన్ని కూడా ఇట్టే పట్టేస్తారు.. అంటూ పునీత్ గొప్పతనం గురించి వివరించాడు.. ఇప్పుడు పంకజ్ త్రిపాఠి ఒక ప్రముఖ నటుడు అని అందరికీ తెలిసిన విషయమే..ఆయన కూడా ఈ స్థాయికి చేరుకోవడానికి ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నాడు అని తెలిపాడు డానిష్.