నా భర్త నిలబడలేడు.. ఇంకా రేప్ ఏం చేస్తాడు.. దిశా నిందితుడు భార్య షాకింగ్ కామెంట్స్?

దిశ కేసు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది అన్న విషయం మనందరికీ తెలిసిందే. హైదరాబాద్ శివారులోని దిశను నలుగురు యువకులు గ్యాంగ్ రేప్ చేసి అత్యంత కిరాతకంగా చంపేశారు. అయితే అప్పట్లో ఈ కేసు ఈ విషయంలో దేశమంతటా చర్చ జరిగింది. ఈ కేసులో నలుగురు ప్రధాన నిందితులైన ఆ నలుగురిని పోలీసులు ఎన్కౌంటర్ చేయడంతో ఆ తరువాత ఈ దిశ కేసు గురించి అందరు మరిచిపోయారు. ఆరిఫ్, జొల్లు శివ, జొల్లు నవీన్, చెన్నకేశవులు నలుగురిని ఎన్కౌంటర్ చేసి చంపేశారు.

ఈ దిశ కేసు జరిగి సంవత్సరం దాటింది. ఇది ఇలా ఉంటే దిశ కేసులో ఒకరైనా చెన్నకేశవులు సరిగ్గా నిలబడలేడని, అలాంటి వ్యక్తి రేప్ ఎలా చేస్తాడని అతని భార్య రేణుక విచారణ కమిషనర్ తెలిపింది. తన భర్త చెన్నకేశవులు కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నట్లు ఆమె తెలిపింది. అంతేకాకుండా అరెస్టు చేసిన కొద్ది రోజులకు అతడిని నిలబడడం లేదని పడిపోతున్నాడని పోలీసులకు ఆమె ఫోన్ చేసి తెలిపినట్టు చెప్పింది. ఇది నకిలీ ఎన్కౌంటర్ అనేదాన్ని హత్యగా పరిగణించాలని రేణుక తరుపు న్యాయవాది విచారణ కమిషనర్ ను కోరారు.