ప్రపంచదేశాలను పట్టిపీడిస్తున్న కరోనా వైరస్ ఎప్పుడు శాశ్వతంగా అతం అవుతుందో ఎవరికీ అంతు చిక్కడం లేదు. అన్ని దేశాల్లోని అన్ని రంగాలపై ప్రభావం చూపుతున్న ఈ మహమ్మారి తగ్గినట్టే తగ్గి.. సెకెండ్ వేవ్ రూపంలో మళ్లీ విజృంభించింది. ఇప్పుడిప్పుడే పరిస్థితులు అదుపులోకి వస్తున్నాయి. భారత్లోనూ కరోనా జోరుకు బ్రేకులు పడ్డాయి.
గత కొద్ది రోజుల నుంచీ భారీగా నమోదవుతున్న రోజూవారీ కేసులు మెల్ల మెల్లగా తగ్గుతూ వస్తున్నాయి. అయితే నిన్న మాత్రం ఇరవై వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. గత 24 గంటల్లో భారత్లో 23,529 మందికి కొత్తగా కరోనా సోకింది. తాజా కేసులతో దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,37,39,980 కు చేరుకుంది. అలాగే నిన్న 311 మంది కరోనా కారణంగా మృత్యువాత పడగా.. దేశంలో కరోనా మరణాల సంఖ్య 4,48,062 కు పెరిగింది.
ఇక నిన్న ఒక్కరోజే 28,718 మంది కోలుకోగా.. ఇప్పటి వరకు దేశంలో కరోనా నుంచి 3,30,14,898 మంది హాస్పటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అలాగే ప్రస్తుతం 2,77,020 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. కాగా, రోజూవారీ కేసుల్లో అత్యధిక కేసులు కేరళ నుంచే వస్తున్నాయి. తాజాగా కేసుల్లోనూ 12,161 కేసులు కేరళలోనే నమోదు అయ్యాయి.