భార‌త్‌లో కొత్త‌గా 31,382 క‌రోనా కేసులు..ఆ రాష్ట్రంలోనే అత్య‌ధికం..!

ప్ర‌పంచ‌దేశాల‌ను ప‌ట్టిపీడిస్తున్న క‌రోనా వైర‌స్ ఎప్పుడు శాశ్వ‌తంగా అతం అవుతుందో ఎవ‌రికీ అంతు చిక్క‌డం లేదు. అన్ని దేశాల్లోని అన్ని రంగాల‌పై ప్ర‌భావం చూపుతున్న ఈ మ‌హ‌మ్మారి త‌గ్గిన‌ట్టే త‌గ్గి.. సెకెండ్ వేవ్ రూపంలో మ‌ళ్లీ విజృంభించింది. అయితే ఇప్పుడిప్పుడే క‌రోనా ఉధృతి నెమ్మ‌దిస్తోంది. భార‌త్‌లోనూ క‌రోనా జోరుకు బ్రేకులు ప‌డ్డాయి.

అయితే గ‌త కొద్ది రోజుల నుంచీ మాత్రం రోజూవారీ కేసులు కాస్త భారీగా న‌మోదు అవుతున్నాయి. గ‌త 24 గంటల్లో భారత్‌లో 31,382 మందికి కొత్తగా కరోనా సోకింది. తాజా కేసుల‌తో దేశ‌వ్యాప్తంగా క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,35,94,803 కు చేరుకుంది. అలాగే నిన్న 318 మంది క‌రోనా కార‌ణంగా మృత్యువాత ప‌డ‌గా.. దేశంలో క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య 4,46,368 కు పెరిగింది.

ఇక నిన్న ఒక్క‌రోజే 32,542 మంది కోలుకోగా.. ఇప్ప‌టి వ‌ర‌కు దేశంలో కరోనా నుంచి 3,28,48,273 మంది హాస్ప‌ట‌ల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అలాగే ప్ర‌స్తుతం 3,00,162 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. కాగా, రోజూవారీ కేసుల్లో అత్య‌ధిక కేసులు కేర‌ళ నుంచే వ‌స్తున్నాయి. తాజాగా కేసుల్లోనూ 19,682 కేసులు కేర‌ళ‌లోనే న‌మోదు అయ్యాయి.