ప్రపంచదేశాలను పెను భూతంలా పట్టిపీడిస్తున్న కరోనా వైరస్ ఎప్పుడు శాశ్వతంగా అతం అవుతుందో ఎవరికీ అంతు చిక్కడం లేదు. అన్ని దేశాల్లోని అన్ని రంగాలపై ప్రభావం చూపిన ఈ మహమ్మారి తగ్గినట్టే తగ్గి.. సెకెండ్ వేవ్ రూపంలో మళ్లీ విజృంభించింది. అయితే ఇప్పుడిప్పుడే కరోనా ఉధృతి నెమ్మదిస్తోంది. భారత్లోనూ కరోనా జోరుకు బ్రేకులు పడ్డాయి అనుకుంటున్న తరుణంలో ఈ మహమ్మారి మళ్లీ ఊపందుకుని ప్రజలను వణికిస్తోంది
అయితే గత మూడు రోజులగా రోజూవారీ కేసులు క్రమక్రమంగా క్షీణిస్తూ వస్తున్నాయి. గత 24 గంటల్లో భారత్లో 25,404 మందికి కొత్తగా కరోనా సోకింది. తాజా కేసులతో దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,32,89,579 కు చేరుకుంది. అలాగే నిన్న 339 మంది కరోనా కారణంగా మృత్యువాత పడగా.. దేశంలో కరోనా మరణాల సంఖ్య 4,43,213 కు పెరిగింది.
ఇక నిన్న ఒక్కరోజే 37,127 మంది కోలుకోగా.. ఇప్పటి వరకు దేశంలో కరోనా నుంచి 3,24,84,159 మంది హాస్పటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అలాగే ప్రస్తుతం 3,62,207 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. కాగా, దేశంలో ఇప్పటివరకు మొత్తం 75,22,38,324 డోసుల వ్యాక్సిన్లు ప్రజలకు అందించారు.