సైబరాబాద్ సీపీగా స్టీఫెన్ రవీంద్ర..సజ్జనార్ ట్రాన్స్ ఫర్..?

హైదరాబాద్ లో నేరాలు అదుపులోకి రావడానికి పోలీసులు ఎంతో శ్రమించారు. మహిళలపై అఘాయిత్యాలు, వేధింపులను అరికట్టారు. సైబరాబాద్ పోలీసులను ఎప్పటికప్పుడు ముందుండి నడిపించిన సీపీ సజ్జనార్ అంటే ఇప్పుడు చాలా మందికి తెలుసు. దిశ అత్యాచార ఘటన సమయంలో ఆయన చేసిన ఎన్ కౌంటర్ కు చాలా మంది హర్షం వ్యక్తం చేశారు. తాజాగా ఆయన సీపీ నుంచి బదిలీ అయ్యారు. ప్రస్తుతం సైబరాబాద్ పోలీస్ కమిషనర్ గా ఐపిఎస్ స్టీఫెన్ రవీంద్ర నియామకం అయ్యారు. ఈ విషయాన్ని తెలంగాణ సర్కార్ వెల్లడించింది.

సజ్జనార్ 3 సంవత్సరాల పాటు సైబరాబాద్ సీపీగా విధులు నిర్వహించారు. దిశ కేసులో కీలకంగా వ్యవహరించి ఆ కేసును త్వరగా క్లోజ్ చేశారు. ఆ సందర్భంగా సోషల్ మీడియాలో ఆయన పేరు మారుమోగింది. ఇండియా వ్యాప్తంగా ఆయన పేరు అంతటా వినిపించింది. ఎక్కడ అఘాయిత్యం జరిగినా కూడా సీపీ సజ్జనార్ కావాలంటూ ప్రజలు గగ్గోలు పెట్టారంటే ఆయనకున్న ఖ్యాతి ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఆయన ఆర్టీసీ ఎండీగా బదిలీ అయ్యి విధులు నిర్వహించనున్నారు.