తెలంగాణ రవాణా శాఖ మంత్రి అయిన పువ్వాడ అజయ్ కుమార్ ఈరోజు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ను ఈరోజు తన కుమారుడితో కలిసి కలిశారు. ఈరోజు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కొడుకు నయన్ పుట్టిన రోజు సందర్భంగా ఎన్టీఆర్ ను కలిసి బొకే అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి, ఆయన కొడుకు ఎన్టీఆర్ కు శాలువా కప్పి సన్మానం కూడా చేశారు. అయితే మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సినిమా హీరోలను, నటులను కలవడం ఇది మొదటిసారి కాదని సమాచారం.
గతంలో కూడా ఆయన ఆచార్య మూవీ షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతున్న టైమ్లో మెగాస్టార్ ను కలిసి చర్చించారు. అప్పుడు కూడా ఆచార్య షూటింగ్ సెట్ కి వెళ్లి చిరంజీవి, డైరెక్టర్ కొరటాల శివ ను కలిసి మాట్లాడారు. దాంతో పాటు ఖమ్మంలో కూడా ఆచార్య మూవీ షూటింగ్ జరుగుతున్న టైమ్లోనే మెగాస్టార కు ఆయన ఇంట్లోనే ఆతిథ్యం ఇచ్చారు భోజనం పెట్టారు.