టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్, డైరెక్టర్ శశి కిరణ్ తిక్కా కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రం మేజర్. శోభితా ధూళిపాళ్ల, సాయి మంజ్రేకర్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని సోనీ పిక్చర్స్, సూపర్ స్టార్ మహేష్ జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్, ఏ ప్లస్ ఎస్ మూవీస్ బ్యానర్స్ సంయుక్తంగా పాన్ ఇండియా లెవల్లో నిర్మిస్తున్నాయి.
26/11 ముంబై తీవ్రవాద దాడుల్లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు సంబంధించి ఓ క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది.
ఈ సినిమా హిందీ శాటిలైట్ రైట్స్ను రూ. 10 కోట్లకు అమ్ముడైనట్టుగా తెలుస్తోంది. దేశభక్తి నేపథ్యంలో రూపొందే సినిమాలు భాషతో సంబంధం లేకుండా ఆదరణ పొందుతూ ఉంటాయి. అందువల్లనే, ఇంత భారీ రేటుకు మేజర్ హిందీ శాటిలైట్ రైట్స్ అమ్ముడయ్యాయని తెలుస్తోంది.