టీన్ డ్రామా స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ 2 ద్వారా బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన అనన్య వరుస అవకాశాలు దక్కించుకుంటోంది. నటుడు చంకీ పాండె కుమర్తెగా ఆమె ఇండస్ట్రీకి పరిచయం. ఆమె స్వతహాగా మోడల్ కూడా. మాల్దీవుల్లో బికీనిపై ఈ అమ్మడు ఇచ్చిన ఫోజులు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అయితే తెలుగు ఇండస్ట్రీలో లైజర్ సినిమా ద్వారా అరంగ్రేట్రం చేయనుంది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తుండగా.. పూరి జగన్నాథ్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు.
వీరిద్దరి కాంబినేషన్లో ఒక ప్రాజెక్ట్ వస్తుందంటే సినిమా ఏ రెంజ్లో ఉంటుందోని భారీ అంచనాలు ఏర్పడ్డాయి. స్వతహాగా పూరి జగన్నాథ్ సినిమాల్లో ఒక యాంగ్రినెస్ కనిస్తుంటుంది. అయితే లైజర్ సినిమా షూటింగ్ మొదలైన తరువాత కరోనా, లాక్ డౌన్ నేపథ్యంలో ఆగిపోయింది. ఇక లాక్ డౌన్ ఎత్తేసిన నేపథ్యంలో సినిమా షూటింగ్ మళ్లీ మొదలైంది. దీంతో అనన్య పాండే తిరిగి షూటింగ్లో పాల్గొనేందుకు సిద్ధం అయ్యింది.