సూప‌ర్ థ్రిల్లింగ్‌గా `అర్ధ‌ శతాబ్ధం` ట్రైల‌ర్‌!

కార్తిక్ రత్నం, కృష్ణప్రియ ప్రధాన పాత్రల్లో రిషిత శ్రీ క్రియేషన్స్ పతాకంపై తెర‌కెక్కిన తాజా చిత్రం అర్ధ‌ శతాబ్ధం. రవీంద్ర పుల్లే దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సాయి కుమార్, అజయ్, ఆమని, పవిత్ర లోకేష్, శరణ్య నటిస్తున్నారు.

ఈ సినిమాను నేరుగా ఓటీటీలో విడుదల చేస్తున్నట్టు ప్రకటించింది చిత్రబృందం. మార్చి 26న ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ ఆహా లో విడుదల కానుంది. అయితే తాజాగా ఈ సినిమా ట్రైల‌ర్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది.

ప్రేమ కోసం జరిగే పోరాటంతో పాటు రాజకీయాలు, కులాల మధ్య జరిగిన వివాదాల నేపథ్యంలో 2003లో జరిగిన యథార్థ సంఘటన ఆధారంగా ఈ చిత్రం తెర‌కెక్కిన‌ట్టు ట్రైల‌ర్ బ‌ట్టీ అర్థం అవుతోంది. సూప‌ర్ థ్రిల్లింగ్ ఉన్న ఈ ట్రైల‌ర్‌.. సినిమాపై భారీ అంచ‌నాల‌ను పెంచేసింది.