దేశవ్యాప్తంగా ఐదు కీలక రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు నేటి ఉదయం మొదలైన సంగతి తెలిసిందే. అయితే అందరి చూపు తమిళనాడుపైనే ఉంది. రాష్ట్రంలోని 234 స్థానాలకూ నేడు ఎన్నికలు జరుగుతున్నాయి.
మొత్తం 3,998 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఎన్నికల కోసం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయగా.. నేటి ఉదయం 7 గంటలకు పోలింగ్ షురూ అయింది. ప్రస్తుతం పోలింగ్ ప్రక్రియ జోరు జోరుగా కొనసాగుతోంది.
ఓటు హక్కును వినియోగించుకునేందుకు సామాన్యులతో పాటు సెలబ్రెటీలు, రాజకీయ నాయకులు కూడా ఉదయాన్నే తరలివస్తున్నారు. ఇప్పటికే రజినీకాంత్, కమల్ హాసన్, శ్రుతి హాసన్, అక్షర హాసన్, అజిత్, షాలినీ కుమార్, సూర్య, కార్తి తెలంగాణ గవర్న తమిళి సై సౌందరరాజన్ వంటి ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. అంతేకాదు అభిమానులకు ఓటు వేయమని పిలుపునిచ్చారు.