కరోనా వచ్చింది మొదలు.. చిత్ర పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా మలయాళ చిత్ర పరిశ్రలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ మలయాళ నటుడు, రచయిత పి. బాలచంద్రన్ కన్నుమూశారు.
ఈయన వయసులో 62 సంవత్సరాలు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న బాలచంద్రన్ నేటి తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. మలయాళంలో పలు సక్సెస్ ఫుల్ చిత్రాల్లో నటించడంతో పాటు పలు చిత్రాలకు స్క్రీన్ రైటర్గా పనిచేసారు.
ఈయన చివరగా మమ్ముట్టి హీరోగా నటించిన ‘వన్’ సినిమాలో ఎమ్మెల్యే పాత్రలో నటించారు. కాగా, బాలచంద్రన్ మృతిపై సినీ ప్రముకుల సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఇక బాలచంద్రన్ అంత్యక్రియలు ఆయన స్వగ్రామం వైకోమ్లో జరగనున్నాయి.