బ్యాడ్మింటన్ ప్లేయర్ గుత్తా జ్వాలా, కోలీవుడ్ హీరో విష్ణు విశాల్ డేటింగ్కు బై బై చెప్పి.. ఎట్టకేలకు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. నేటి మధ్యాహ్నం వీరిద్దరు వివాహం చేసుకున్నారు.
హైదరాబాదులోని మొయినాబాదులో జరిగిన వీరి విహానికి కరోనా కారణంగా కొద్ది మంది బంధువులు, సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. అయితే భారత్ బ్యాడ్మింటన్ ప్లేయర్ చేతన్ ఆనంద్ను 2005లో వివహం చేసుకున్న జ్వాల .. 2011లో అతనితో విడాకులు తీసుకున్నారు.
మరోవైపు 2010లో రజనీ నటరాజన్ను పెళ్లి చేసుకున్న విష్ణు విశాల్ 2018లో ఆమెతో విడాకులు తీసుకున్నారు. అయితే విశాల్ సోదరి పెళ్లి వేడుకల్లో తొలిసారిగా జ్వాల-విష్ణు కలిశారు. అప్పుడు వీరి మధ్య చిగురించిన స్నేహం కాస్త ప్రేమగా మరి ఇప్పుడు పెళ్లి వరకు వెళ్లింది. ప్రస్తుతం వీరి వివాహ ఫొటోలు వైరల్గా మారాయి.