గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా రిలీజ్ అయ్యిందో లేదో క్రిష్ పేరు సౌత్ ఇండియాతో పాటు ఓవర్సీస్లో మార్మోగిపోతోంది. రాజమౌళి లాంటి దర్శకులు సైతం క్రిష్ నుంచి తాము నేర్చుకోవాల్సింది చాలా ఉందంటూ క్రిష్ను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. శాతకర్ణి లాంటి సినిమాను కేవలం రూ.50 కోట్ల బడ్జెట్లో 79 రోజుల్లో తెరకెక్కించాడంటే అందరూ స్టన్ అయిపోతున్నారు.
అంత తక్కువ బడ్జెట్, అన్ని తక్కువ రోజులు తీసుకున్నా శాతకర్ణి కథనాన్ని నడిపే విషయంలో ఎక్కడా తడబాటు లేకుండా, క్వాలిటీతో సినిమా తెరకెక్కించిన విధానాన్ని చూసి ఇండస్ట్రీ మొత్తం షాక్ అవుతోంది. టాలీవుడ్ మొత్తం సాహో క్రిష్ అంటూ కితాబులు ఇస్తోంది. అంతకుముందు వరకు చిన్న హీరోలతోనే సినిమాలు చేసిన క్రిష్కి ఇప్పుడు బడా హీరోలతోనే ఛాన్సుల మీద ఛాన్సులు వస్తున్నాయి.
ఇప్పుడు టాలీవుడ్ అగ్రహీరోలందరూ క్రిష్తో సినిమా చేసేందుకు ఆసక్తితో ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవితో పాటు చాలా మంది అగ్ర హీరోలు క్రిష్తో సినిమా విషయమై ఆలోచన చేస్తున్నారు. ఇక ఈ క్రమంలోనే ఇప్పుడు టాలీవుడ్ అగ్రహీరో విక్టరీ వెంకటేష్ – క్రిష్ కాంబోలో సినిమా తెరకెక్కేందుకు రంగం సిద్ధమైనట్టు తెలుస్తోంది.
క్రిష్ రీసెంట్గా ఓ కథను వెంకటేష్, ఆయన సోదరుడు నిర్మాత సురేష్బాబుకు చెప్పాడట. ఇద్దరికీ స్టోరీ లైన్ నచ్చేయడంతో వెంటనే ఓకే అన్నారట. ఈ మూవీని తమ సొంత బ్యానర్లోనే తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది.
శాతకర్ణిలాగే ఇది కూడా చారిత్రక నేపథ్యం ఉన్న సినిమా అని, దీనికి కూడా గ్రాఫిక్స్ వర్క్ ఎక్కువగానే ఉంటాయని తెలుస్తోంది. ఏదేమైనా క్రిష్ నుంచి మరో హిస్టారికల్ సినిమా అంటేనే టాలీవుడ్ సర్కిల్స్లో అప్పుడే మంచి అంచనాలు వచ్చేశాయి.