జయతి అంటే బుల్లితెర యాంకర్గా మాత్రమే చాలామందికి తెలుసు. ‘వెన్నెల’ అనే మ్యూజిక్ షోతో పాపులర్ అయింది జయతి. యాంకరింగ్లో తనదో డిఫరెంట్ స్టైల్ అని చూపించింది ఈ ప్రోగ్రామ్తో ముద్దుగుమ్మ జయతి. అయితే తనకి సినిమాల్లోకి రావాలన్న ఇంట్రెస్ట్తో వెండితెర ఎంట్రీకి కూడా చాలా ప్రయత్నాలు చేసింది. అందులో భాగంగా తెలుగులో రవిబాబు దర్శకత్వంలో వచ్చిన ‘పార్టీ’ సినిమాలో తళుక్కున మెరిసింది. ఈ సినిమాలో ఓ పాటలో తన డాన్స్తో అలరించింది జయతి. ఆ తర్వాత ఆమె వెండితెరపై నటిగా పెద్దగా అవకాశాలు దక్కించుకోలేకపోయింది. దాంతో ఇటు బుల్లి తెరకు, అటు వెండి తెరకూ కూడా దూరమయ్యింది.
కానీ ఈమె ఇప్పుడు నిర్మాతగా మారి అందరికీ షాక్ ఇచ్చింది. ‘లచ్చి’ అనే సినిమాని నిర్మించి, అందులో ప్రధాన పాత్రలో కనిపించబోతోంది ముద్దుగుమ్మ జయతి. మంచి మెసేజ్ ఇచ్చే డిఫరెంట్ అటెంప్ట్ అని ఈ చిత్రం గురించి జయతి చెప్పింది. హర్రర్ థ్రిల్లర్ అట ఈ ‘లచ్చి’. అదేకాదు ఇప్పుడు వస్తోన్న హారర్ మూవీస్కి పూర్తి భిన్నంగా ఉండబోతోందట ఈ సినిమా. ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ చేతుల మీదుగా చిత్ర ఫస్ట్ లుక్ని లాంఛ్ చేశారు. పూరి, ఈ సినిమా టీజర్ తనకు బాగా నచ్చిందని చెప్పడంతో ఉన్నపళంగా సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ఈ చిత్రం ద్వారా ఈశ్వర్ అనే కొత్త దర్శకుడ్ని పరిచయం చేస్తున్నారు. సో జయతి చేస్తున్న ఈ న్యూ అటెంప్ట్ సక్సెస్ అవ్వాలని ఆశిద్దాం!