బ్రహ్మూెత్సవం’ సినిమా పరాజయం మహేష్ని చాలా కలిచి వేసింది. దాంతో మహేష్ మహా స్పీడయ్యాడు. వరుసపెట్టి రెండు సినిమాలను లైన్లో పెట్టేశాడు. అవి కూడా భారీ సినిమాలే. ఒకటి మురుగదాస్ డైరెక్షన్లో సినిమా అయితే, తాజాగా వంశీ పైడిపల్లితో సినిమా ఓకే చేశాడు. ఈ రెండు సినిమాలను ఏకకాలంలో పూర్తి చేసి ప్రేక్షకుల్ని ఫుల్ ఖుషీ చేయాలని డిసైడ్ అయ్యాడట ప్రిన్స్ మహేష్బాబు.
మురుగదాస్తో సినిమా ఆల్రెడీ సెట్స్ మీద ఉంది. ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటిస్తోంది ఇకపోతే వంశీ పైడిపల్లితో చేయబోయే సినిమా కోసం భారీగా కసరత్తులు జరుగుతున్నాయట. ఇప్పటికే స్క్రిప్టు పనుల్లో బిజీగా ఉన్నాడు డైరెక్టర్ వంశీ పైడిపల్లి. అద్భుతమైన ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ సినిమాను తెరకెక్కించాలనుకుంటున్నాడట వంశీ. అంతేకాదు ఈ సినిమాకు పీవీపీ సంస్థ నిర్మాణ బాధ్యతల్ని తీసుకోనుంది. ఈ సంస్థ డిఫరెంట్ స్టోరీస్ని భారీ బడ్జెట్తో తెరకెక్కించడంలో దిట్ట.
అలాగే మహేష్ సినిమా కోసం పీవీపీ సంస్థ సుమారు వంద కోట్ల బడ్జెట్ని ప్లాన్ చేస్తోందట. ఈ సినిమాతో మహేష్ ‘శ్రీమంతుడు’లాంటి బారీ విజయాన్ని అందుకోవడం పక్కా అంటున్నాయి ట్రేడ్ వర్గాలు. మరో వైపు మహేష్ కొరటాల కాంబినేషన్లో ఒక సినిమా చేయనున్నాడు. అయితే ఈ రెండింటిలో ఏ సినిమా ముందుగా సెట్స్ మీదికెళ్తుందనేది ఇంకా క్లారిటీ రాలేదు. అంతేకాదు పూరీ, మహేష్ కాంబినేషన్ కూడా లైన్లో ఉంది. సో వరుస సినిమాలతో మహేష్ సూపర్ బిజీ అన్న మాట.