ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లొస్తే ఏపీ, తెలంగాణ‌లో గెలుపెవ‌రిది…

ఇంకా రెండేళ్ల స‌మ‌యం ఉండ‌గానే.. ఇప్ప‌టినుంచే తెలుగు రాష్ట్రాల్లో ఎన్నిక‌ల హ‌డావుడి మొద‌లైంది. ఎన్నిక‌ల్లో గెలుపే ల‌క్ష్యంగా ఇటు టీడీపీ, అటు టీఆర్ఎస్ ప్ర‌య‌త్నాలు మొద‌లుపెట్టేశాయి. కొత్త‌గా రాజ‌కీయ తెర‌పై భ‌విత‌వ్యాన్ని ప‌రీక్షించుకోవాల‌ని నిర్ణ‌యించిన జ‌న‌సేన.. ఈసారి ఎన్నిక‌ల్లో ఎలాంటి ప్ర‌భావం చూపుతుంది? సీఎం కావాల‌నుకునే ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్ ఆశ‌లు ఈసారి నెర‌వేర‌తాయా? అటు టీఆర్ఎస్‌లో మ‌ళ్లీ బ‌లం పుంజుకోవాల‌ని ప్ర‌య‌త్నిస్తున్న కాంగ్రెస్ ఆశ‌లు ఎంత‌వ‌ర‌కూ ఫ‌లిస్తాయి? అనే ప్ర‌శ్న‌లు అందరిలోనూ ఉన్నాయి. అయితే ఇప్ప‌టికిప్పుడు […]

ఇప్పుడు చంద్ర‌బాబు టార్గెట్ వాళ్లేనా

అసంతృప్తి.. టీడీపీలో ఈమ‌ధ్య విప‌రీతంగా వినిపిస్తున్న ప‌దం!! క్ర‌మ‌శిక్ష‌ణ‌కు మారుపేర‌యిన టీడీపీలో అసంతృప్తి వ‌ల్ల తీవ్ర అల‌జ‌డి రేగుతోంది. ముఖ్యంగా పార్టీని రాజ‌కీయంగా బ‌లోపేతం చేసేందుకు ఎంచుకున్న `ఆకర్ష్‌` వ‌ల్ల ఇది మ‌రింత తీవ్ర‌మైంది. రెండేళ్లలో ఎన్నిక‌లు స‌మీపిస్తున్న త‌రుణంలో.. ఇదే అసంతృప్తి కొన‌సాగితే.. జంపింగ్‌లు ఎక్కువ‌వుతాయ‌ని దీనివ‌ల్ల‌ పార్టీకి తీవ్ర న‌ష్ట త‌ప్ప‌ద‌ని భావించిన అధినేత చంద్ర‌బాబు భావిస్తున్నారు. ముఖ్యంగా శిల్పా మోహ‌న్‌రెడ్డి వైసీపీలో చేర‌డంతో వెంట‌నే ఆయ‌న అల‌ర్ట్ అయ్యారు. ఇలా వ‌దిలేస్తే ఇంకా […]

క్యాస్ట్ పాలిటిక్స్ వ‌ద్దంటోన్న జ‌గ‌న్‌

కుల రాజ‌కీయాల‌పై వైసీపీ అధినేత వైఎస్‌.జ‌గ‌న్ ఆస‌క్తిక‌రంగాను, సామ‌ర‌స్య‌పూర్వ‌కంగాను మాట్లాడారు. కొద్ది రోజులుగా ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా గ‌ర‌గ‌ప‌ర్రులో ద‌ళితుల‌కు, ద‌ళితేత‌రుల‌కు మ‌ధ్య వార్ జ‌రుగుతోన్న సంగ‌తి తెలిసిందే. గ్రామంలో అంబేద్క‌ర్ విగ్ర‌హం ఏర్పాటుపై చెల‌రేగిన గొడ‌వ కాస్తా పెద్ద‌దిగా మారిన సంగ‌తి తెలిసిందే. దీంతో రాష్ట్ర‌వ్యాప్తంగా వివిధ పార్టీల‌కు చెందిన ద‌ళిత నాయ‌కులు సైతం అక్క‌డ‌కు చేరుకుని గ‌ర‌గ‌ప‌ర్రులో బాధితుల‌ను ప‌రామ‌ర్శిస్తున్నారు. ఈ కోవ‌లోనే వైసీపీ అధినేత వైఎస్‌.జ‌గ‌న్ సైతం శుక్ర‌వారం గ‌ర‌గ‌ప‌ర్రుకు వెళ్లి అక్క‌డ సాంఘిక […]

జ‌గ‌న్ కోసం ఒక్క‌టైన తెర వెన‌క లీడ‌ర్లు..!

ఏపీలో జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఏర్ప‌డ‌నుందా? 2019లో జ‌గ‌న్ సీఎం క‌ల నెర‌వేర‌బోతోందా? అంటే.. ఇప్పుడు గ్యారెంటీగా ఔన‌నే స‌మాధాన‌మే వ‌స్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కు మౌనంగా ఉన్న దివంగ‌త వైఎస్ మిత్రులు, స‌న్నిహితులు అంద‌రూ జ‌గ‌న్‌కి జ‌ట్టుగా క‌లిసి రావాల‌ని డిసైడ్ అయ్యార‌ట‌. వైఎస్ అధికారంలో ఉండ‌గా ఆయ‌న‌తో ఎంతో చెలిమి చేసిన రాజ‌మండ్రి మాజీ ఎంపీ ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్ ఇప్పుడు జ‌గ‌న్‌ని సీఎంని చేసే బాధ్య‌త తీసుకున్నార‌ని, దీనివెనుక వైఎస్ ఆత్మ కేవీపీ ప్ర‌ధాన చ‌క్రం […]

దేవినేని ఉమా వ‌దిన మృతిపై వైసీపీ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు

ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల మంత్రి దేవినేని ఉమాపై సంచ‌ల‌న ఆరోప‌ణలు వ‌చ్చాయి. ఉమా త‌న వ‌దిన (మాజీ మంత్రి దేవినేని వెంక‌ట‌ర‌మ‌ణ భార్య‌)ను చంపేశాడ‌ని కృష్ణా జిల్లా జ‌నాలు ఇప్ప‌ట‌కీ అనుకుంటార‌ని వైసీపీ నేత జోగి ర‌మేశ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఇక ఉమాను ర‌మేశ్ ఉత్త మాట‌లు చెప్పే పిట్ట‌ల దొర‌గా కూడా అభివ‌ర్ణించారు. జోగి ర‌మేశ్ గ‌త ఎన్నిక‌ల్లో మైల‌వరం నుంచి ఉమా మీద పోటీ చేసి ఓడిపోయారు. తాజాగా ఉమా గురించి మాట్లాడిన ర‌మేశ్ […]

మూడు పార్టీల్లోను సెగ‌లు రేపుతోన్న ఆ సీటు

ఏపీలో ఓ ఎంపీ సీటుకు జ‌రుగుతోన్న రాజ‌కీయం ఇప్పుడు య‌మా హాటుగా మారింది. అధికార టీడీపీ, విప‌క్ష వైసీపీ, కొత్త‌గా పోటీ చేస్తోన్న జ‌న‌సేన ఈ మూడు పార్టీల నుంచి ఆ ఎంపీ సీటుకు కీల‌క‌మైన అభ్య‌ర్థులు రంగంలో ఉంటార‌న్న ప్ర‌చారం ఇప్పుడు అక్క‌డ పొలిటిక‌ల్ వాతావార‌ణాన్ని ఎన్నిక‌ల‌కు రెండేళ్ల ముందే హీటెక్కించేస్తోంది. ప్ర‌స్తుతం అక్క‌డ టీడీపీ సిట్టింగ్ ఎంపీగా ఉన్న గ‌ల్లా జ‌య‌దేవ్‌కు బ‌దులుగా వ‌చ్చే ఎన్నిక‌ల్లో అక్క‌డ నుంచి టీడీపీ త‌ర‌పున చంద్ర‌బాబు కోడ‌లు […]

జ‌గ‌న్‌కి ఘ‌ట్ట‌మ‌నేని వారి స్థ‌లం!

వైసీపీ అధినేత జ‌గ‌న్‌కి ఘ‌ట్ట‌మ‌నేని వంశానికి అవినాభావ సంబంధం ఉంది. దివంగ‌త వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి బ్ర‌తికున్న రోజుల్లో ఘ‌ట్ట‌మ‌నేని కృష్ణ అండ్ ఆదిశేష‌గిరిరావులు ఆయ‌న వెంట న‌డిచారు. 2014 ఎన్నిక‌ల్లో గ‌ల్లా జ‌య‌దేవ్ టీడీపీ త‌ర‌ఫున పోటీ చేయ‌కుండా ఉండి ఉంటే.. ఘ‌ట్ట‌మ‌నేని వారి మ‌ద్ద‌తు జ‌గ‌న్‌కే ఉండేది. అయినా కూడా ఘ‌ట్ట‌మ‌నేని కుటుంబం జ‌గ‌న్ ప‌ట్ల విధేయ‌త‌గానే ఉంది. తాజాగా జ‌గ‌న్‌కి ఆదిశేష‌గిరిరావు భారీ స్థాయిలో సాయం చేస్తున్నార‌ని వార్త వ‌చ్చింది. రాష్ట్ర బైఫ‌ర్ కేష‌న్ […]

వైసీపీలో బొత్సా రేటింగ్ పెరిగిందా..?

బొత్సా స‌త్య‌నారాయ‌ణ‌. పెద్ద‌గా ప‌రిచ‌యం అక్క‌ర్లేని నేత‌. కిర‌ణ్ కుమార్ రెడ్డి ప్ర‌భుత్వంలో నెంబ‌ర్ 2గా సాగిన ఉత్త‌రాంధ్ర నాయ‌కుడు. విభ‌జ‌న‌తో కునాల్లిన కాంగ్రెస్‌ను వ‌దిలేసి వ‌చ్చి.. వైఎస్ త‌న‌యుడు పెట్టిన వైసీపీలో చేరారు. మొద‌ట్లో కొంత భిడియంతో మీడియా ముందుకు వ‌చ్చేందుకు తాత్సారం చేసినా.. త‌ర్వాత త‌ర్వాత వైసీపీ అధికార ప్ర‌తినిధి స్థాయిలో మాట్లాడ‌డం ప్రారంభించారు. టీడీపీ అధినేత చంద్ర‌బాబు, ఆయ‌న కొడుకు లోకేష్‌ల‌పైనా వారి వ్యాపారం హెరిటేజ్‌పైనా ఆయ‌న విమ‌ర్శ‌ల బాణాలు సంధించారు కూడా. […]

వైసీపీలో చేరేందుకు ఆ టీడీపీ ఎమ్మెల్యే రంగం సిద్ధం!

ఏపీ మాజీ మంత్రి తీరు టీడీపీ నేత‌ల‌కు అంతుచిక్క‌డం లేదు. ఒక‌ప‌క్క టీడీలోనే కొన‌సాగుతూ.. మ‌రోప‌క్క ప్రతిప‌క్ష నేత‌ల‌తో `ట‌చ్‌`లో ఉంటూ క‌న్ఫ్యూజ్ చేస్తున్నార‌ట‌. అయితే ఆయ‌న మాత్రం ప‌క్కా ప్ర‌ణాళిక‌తోనే ముంద‌కు వెళుతున్న‌ట్లు సమాచారం. ఇటీవ‌ల జ‌రిగిన మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ‌లో రావెల కిషోర్‌బాబు మంత్రి ప‌ద‌వి ఊడ‌బీకేసిన విష‌యం తెలిసిందే! ప్ర‌స్తుతం ఆయ‌న‌కు వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్టు ఇవ్వ‌క‌పోవ‌చ్చ‌నే స్ప‌ష్ట‌మైన సంకేతాలు ఉన్నాయి. వీటిని ప‌సిగ‌ట్టిన ఆయ‌న‌.. ఇక వైసీపీలో చేరేందుకు అన్ని అస్త్రాలు […]