ఇద్ద‌రు ఏపీ మంత్రుల‌పై లైంగీక వేధింపుల ఆరోప‌ణ‌లు

అవ‌కాశం వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా బాబు స‌ర్కారుపై ఎక్కేసే వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజా.. నిన్న రాఖీ పండ‌గ సంద‌ర్భంగా ఓ రేంజ్‌లో రెచ్చిపోయింది. ఏపీ మంత్రులంద‌రూ కంత్రీల‌ని, టీడీపీ ఎమ్మెల్యేలు కాల‌కేయుళ్ల‌ని భారీ స్తాయిలో విరుచుకుప‌డింది. ముఖ్యంగా రాష్ట్రంలో ఇద్ద‌రు మంత్రుల‌కు కామ కోరిక ఎక్కువ‌ని సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. వారిద్ద‌రిపైనా లైంగిక వేధింపుల కేసులు కూడా ఉన్నాయ‌ని చెప్పింది. రాష్ట్రంలో మ‌హిళ‌ల‌కు ప‌ట్ట‌ప‌గ‌లు కూడా న‌డిచే స్వ‌తంత్రం లేద‌ని, కాల్ మ‌నీ పేరుతో వ్య‌భిచారంలోకి దింపేశార‌ని ఆరోపించింది. […]