రాజకీయాలు ఒకప్పుడు నేతలను బట్టి మారుతుండేవి. కానీ, ప్రస్తుతం ట్రెండు మారింది. కులాల కార్డులే పార్టీలను, రాజకీయాలను శాసిస్తున్నాయి. అచ్చం ఇప్పుడు ఇలాంటి పరిస్థితినే విపక్షం వైసీపీ విశాఖపట్నంలో ఎదుర్కొంటోందని వార్తలు వస్తున్నాయి. జిల్లాలో వైసీపీకి ఇప్పుడు కులం తగాదాలు మిన్నుముట్టాయట. ప్రస్తుతం రాష్ట్రంలో కాపులు తమ రిజర్వేషన్ కోసం ఉద్యమాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో వారిని చేరదీయడం వల్ల రాజకీయంగా ప్రయోజనం ఉంటుందని భావించిన వైసీపీ.. నేతలు విశాఖలో ఈ వర్గాన్ని చేరదీశారట. […]