జనసేనకు సీట్లు ఫిక్స్ చేస్తున్న వైసీపీ..పవన్‌కు సీఎం ఛాన్స్ లేదా?

జనసేనకు వైసీపీ సీట్లు ఫిక్స్ చేస్తుంది..అదేంటి వైసీపీ సీట్లు ఫిక్స్ చేయడం ఏంటి అని డౌట్ రావచ్చు. నిజమే టి‌డి‌పి-జనసేన పొత్తు ఉంటే..జనసేనకు ఎన్ని సీట్లు దక్కుతాయో వైసీపీ నేతలు చెబుతున్నారు. అంటే టి‌డి‌పి పొత్తులో జనసేనకు ఎక్కువ సీట్లు దక్కవనే విధంగా మాట్లాడుతున్నారు. అసలు మొదట నుంచి రెండు పార్టీల పొత్తు చెడగొట్టాలనే ఉద్దేశంతోనే వైసీపీ రాజకీయం చేస్తున్నట్లు కనిపిస్తోంది. అందుకే పవన్‌కు దమ్ముంటే ఒంటరిగా పోటీ చేయాలని, 175 సీట్లలో పోటీ చేయాలని సవాల్ […]

లోకేష్-ప్రకాష్‌ పప్పు అంటూ రోజా..నగరిపై కాన్ఫిడెన్స్ ఉందా?

ఫైర్ బ్రాండ్ నాయకురాలు, మంత్రి రోజా…ఏపీ  రాజకీయాల్లో మరింత ఫైర్ చూపిస్తున్నారు. టి‌డి‌పి, జనసేనల టార్గెట్ గా విరుచుకుపడుతున్నారు. చంద్రబాబు, పవన్, లోకేష్‌లపై తనదైన శైలిలో కౌంటర్లు వేస్తున్నారు. ఇక వారు జగన్‌ని ఏం చేయలేరన్నట్లు మాట్లాడుతున్నారు. అసలు జీవితంలో వారు గెలవడం, అధికారంలోకి రావడం కష్టమన్నట్లు చెప్పుకొస్తున్నారు. తాజాగా కూడా లోకేష్, నగరి టి‌డి‌పి ఇంచార్జ్ గాలి భాను ప్రకాష్‌లని ఉద్దేశించి రోజా ఫైర్ అయ్యారు. ఒకడేమో మంగళగిరి పప్పు అని, మరొకడు నగరి పప్పు […]

విశాఖ రాజకీయం..బాబు-పవన్ టార్గెట్ క్లియర్ కట్.!

అతి త్వరలోనే జగన్ విశాఖ నుంచి పాలన మొదలుపెట్టనున్న విషయం తెలిసిందే. ఈ దసరాకు విశాఖలో కాపురం పెడతానని చెప్పుకొస్తున్నారు. ఇక జగన్ విశాఖ నుంచి పాలన మొదలుపెట్టి..రాజధాని ఏర్పాట్లు ముమ్మరం అయితే..విశాఖలో వైసీపీకి రాజకీయంగా కలిసొస్తుంది. ఆ ప్రభావం ఉత్తరాంధ్రపై కూడా పడుతుంది. ఇది వైసీపీకి అడ్వాంటేజ్. ఈ నేపథ్యంలో వైసీపీని నిలువరించడానికి చంద్రబాబు, పవన్ గట్టిగానే కష్టపడుతున్నారు. విశాఖ వేదికగా రాజకీయ వేడి రగులుస్తున్నారు. ఇప్పటికే పవన్ విశాఖలో వారాహి మూడో విడత యాత్ర […]

కర్నూలు తమ్ముళ్ళ పోరాటం..ఆ సీట్లపైనే ఆశలు.!

వైసీపీ కంచుకోట అయిన ఉమ్మడి కర్నూలు జిల్లాలో తెలుగుదేశం నేతలు పోరాడుతున్నారు. ఈ సారి అక్కడ సత్తా చాటాలని చూస్తున్నారు. దాదాపు జిల్లాలోని నేతలంతా ప్రజా క్షేత్రంలో ఉన్నారు. ఇటు వైసీపీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత పెరుగుతున్న నేపథ్యంలో..ఈ సారి ఎలాగైనా వారికి చెక్ పెట్టి గెలవాలని చూస్తున్నారు. గత ఎన్నికల్లో జిల్లాలో 14కి 14 సీట్లు వైసీపీ గెల్చుకుంది. ఈ సారి సగం సీట్లు అయిన గెలవాలని తమ్ముళ్ళు కష్టపడుతున్నారు. దాదాపు అందరూ నేతలు ప్రజల్లోనే ఉన్నారు. […]

శ్రీదేవి భజన..బాబు సీటు ఇస్తారా?

ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ అధినేతలకు భజన చేసే నేతలకు కొదవ ఉండదనే చెప్పాలి. అలాంటి భజన చేయడంలో తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవికి తిరుగులేదనే చెప్పాలి. మొన్నటివరకు వైసీపీలో ఉన్న ఈమె..జగన్‌కు ఏ స్థాయిలో భజన చేసిందో చెప్పాల్సిన పని లేదు. ఆరోగ్య శ్రీతో గుండె ఆపరేషన్ చేయించుకున్న గుండె..జగన్ జగన్ అని కొట్టుకుంటుందని అసెంబ్లీ సాక్షిగా భజన చేశారు. అయితే ఈమె ఎమ్మెల్యేగా పూర్తిగా ఫెయిల్ అయ్యారు. తాడికొండ ప్రజలకు ఎప్పుడు అందుబాటులో […]

రిషికొండ వివాదం..విశాఖ జనమే తేల్చేస్తారా?

గత కొన్ని రోజులుగా ఏపీ రాజకీయాల్లో రిషికొండ అంశం వివాదాస్పదంగా మారిన విషయం తెలిసినే. వైసీపీ ప్రభుత్వం..పరిపాలన రాజధాని విశాఖలో ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇదే క్రమంలో విశాఖలోని రిషికొండని తవ్వేసి..అక్కడ నిర్మాణాలు చేపట్టారు. ఆ నిర్మాణాలు సి‌ఎం జగన్ నివాసం ఉండటానికి అని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అసలు ప్రకృతిని నాశనం చేసి ఇలా అక్రమ కట్టడాలు కట్ట కూడదని ఫైర్ అవుతున్నాయి. ఇప్పటికే రిషికొండపై అటు చంద్రబాబు, ఇటు పవన్ ఫైర్ […]

రుషికొండలో ఏం కడుతున్నారో తెలుసా….?

రుషికొండ… గతేడాది వరకు విశాఖ వాసులకు మాత్రమే బాగా తెలిసిన ప్రాంతం. కానీ ఇప్పుడు మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా మారు మోగుతున్న ప్రదేశం. విశాఖలో ప్రముఖ పర్యాటక కేంద్రంగా ఉన్న ప్రాంతం రుషి కొండ. వైసీపీ ప్రభుత్వం ఆ కొండను తవ్వేసి ఏదో కడుతోందని ఇప్పటి వరకు విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. దీనిని పరిశీలించడానికి టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ స్వయంగా రుషికొండకు వెళ్లారు కూడా. అయితే పోలీసు ఆంక్షల కారణంగా […]

అమలాపురం సీటుపై ట్విస్ట్..వైసీపీ-టీడీపీల్లో కన్ఫ్యూజన్.!

అంబేద్కర్ కోనసీమ జిల్లాలో తాజాగా సి‌ఎం జగన్ పర్యటించిన విషయం తెలిసిందే. వైఎస్సార్ సున్నా వడ్డీ పథకానికి బటన్ నోక్కారు. ఇదే సమయంలో కోనసీమలో రాజకీయంగా వైసీపీ పట్టు తగ్గకుండా ఉండేలా జగన్ వ్యూహాలు రచిస్తున్నారు. ఇదే సమయంలో వచ్చే ఎన్నికల్లో అభ్యర్ధుల ఎంపిక విషయంలో జగన్ కీలక నిర్ణయాలు తీసుకునే దిశగా వెళుతున్నారు. ఈ క్రమంలోనే అమలాపురం అసెంబ్లీలో మంత్రి పినిపే విశ్వరూప్ సీటు విషయంలో జగన్ అనూహ్య నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తోంది. నియోజకవర్గంలో విశ్వరూప్, […]

టీడీపీ-జనసేన నెక్స్ట్ ఉగాదికి ఉండవా?

నెక్స్ట్ ఎన్నికల్లో మళ్ళీ అధికారంలోకి వచ్చేస్తామనే కాన్ఫిడెన్స్ లో వైసీపీ నేతలు ఉన్నారనే చెప్పాలి. ఈ సారి 175కి 175 సీట్లు గెలిచేస్తామని చెబుతున్నారు. ఇంకా ప్రతిపక్షాలు అడ్రెస్ ఉండవని మాట్లాడుతున్నారు. జగన్ ప్రజలకు మంచి చేస్తున్నారు కాబట్టే..మళ్ళీ ప్రజలు జగన్‌కు అండగా నిలబడతారని వైసీపీ నేతలు మాట్లాడుతున్నారు. ఇక తాజాగా మంత్రి బొత్స సత్యనారాయణ ఓ అడుగు ముందుకేసి..వచ్చే ఉగాదికి టి‌డి‌పి-జనసేనలు ఉండవని, ఉంటే తాను గుండు కొట్టించుకుంటానని చెప్పుకొచ్చారు. ఒకరు 40 ఏళ్ల ఇండస్ట్రీ, […]