హత్యకు గురైన న్యాయవాది వామనరావు తండ్రి కిషన్ రావు మాజీ మంత్రి ఈటల రాజేందర్పై, పెద్దపల్లి చైర్మన్ పుట్టమధుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తన కొడుకు వామన రావు హత్యకు పుట్ట మధు దంపతులే సుపారీ ఇచ్చారని ఆరోపించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. వామనరావు దంపతులు వేస్తున్న కేసులకు భయపడే వారిద్దర్ని పుట్ట మధు దంపతులు పరోక్షంగా పాల్గొని హత్య చేయించారని మండిపడ్డారు. తాను దుఃఖంలో ఉన్న సమయంలో రామగిరి ఎస్సై కంప్లైంట్ రాయించుకున్నారని, కేసులో ఎవరెవరు […]