సినీనటుడు బాబు మోహన్.. టీఆర్ఎస్లో చేరి ఆందోల్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. పార్టీ నాయకులందరితోనూ ఆయనకు సత్సంబంధాలు మెరుగ్గా ఉన్నాయి. కానీ ఆయన నియోజకవర్గంలో మాత్రం ఇప్పుడు ఎదురుగాలి వీస్తోంది. ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహించిన సర్వేలో బాబూ మోహన్కు అతి తక్కువ మార్కులే రావడం.. ఆయనకు చిక్కులు తెచ్చిపెడుతోంది. అంతేగాక ఆయన నియోజకవర్గంలో కాంగ్రెస్ నేత, మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహకు ఎక్కువ మార్కులు పడటం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఇక టీఆర్ఎస్లో ఆయన శకం దాదాపు ముగిసినట్టేననే […]