కేసీఆర్ దూకుడు పెంచారు. తనపై విపక్షాల నుంచి ఎదురువుతున్న ముప్పేట దాడి నేపథ్యంలో మరింత చురుగ్గా వ్యవహరించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. విద్యార్థులకు ఫీజ్ రీయింబర్స్ మెంట్ సహా ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు, కొత్త ఉద్యోగాలు, గొర్రెల పంపకం వంటి కార్యక్రమాలతో ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లి విపక్షాల విమర్శలకు చెక్ పెట్టాలని డిసైడ్ అయ్యారు. అంతేకాదు, ఇదే సమయంలో రాష్ట్రంలో 2018లోనే ఎన్నికలు నిర్వహించేలా ప్లాన్-బి(బిఫోర్)ను అమలు చేయాలని చూస్తున్నారట. వాస్తవానికి తెలంగాణలో 2019లో ఎన్నికలు జరగాల్సి ఉంటుంది. […]